Advertisement

Advertisement


Home > Movies - Movie News

తల్లి అయిన ప్రియాంక చోప్రా

తల్లి అయిన ప్రియాంక చోప్రా

నిత్యం హాట్ హాట్ గా కనిపిస్తుంది. బేబీ బంప్ కూడా కనిపించలేదు. కనీసం తను ప్రెగ్నెంట్ అని కూడా ప్రకటించలేదు. అయినప్పటికీ ప్రియాంక చోప్రా తల్లయింది. అవును.. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని భార్యభర్త ఇద్దరూ అధికారికంగా ప్రకటించారు.

"సరోగేట్ ద్వారా ఓ బేబీకి మేం జన్మనిచ్చాం. ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రత్యేక సమయంలో మేం కాస్త ప్రైవసీ కోరుకుంటున్నాం. ఫ్యామిలీపై మరింత ఫోకస్ పెట్టబోతున్నాం."

ఇలా సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ప్రియాంక చోప్రా కన్ ఫర్మ్ చేసింది. అయితే ఆమెకు పుట్టింది ఆడ బిడ్డా లేక మగ బిడ్డా అనే విషయాన్ని మాత్రం ప్రియాంక బయటకు చెప్పలేదు.

2018 డిసెంబర్ లో నిక్ ను పెళ్లి చేసుకుంది ప్రియాంక చోప్రా. రాజస్థాన్ లో 3 రోజుల పాటు వీళ్ల పెళ్లి కన్నులపండువగా జరిగింది. ఇక ఆ తర్వాత ఏడాది నుంచి ప్రియాంక గర్భం దాల్చిందంటూ ఎప్పటికప్పుడు కథనాలు వస్తూనే ఉన్నాయి. మధ్యలో వీళ్లిద్దరూ విడిపోతున్నారనే ప్రచారం కూడా నడిచింది. ఇన్నాళ్లకు వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పడింది. ప్రియాంక-నిక్ తల్లిదండ్రులయ్యారు.

తను తల్లి కాబోతున్న విషయాన్ని కొద్దికాలం కిందటే పరోక్షంగా బయటపెట్టింది ప్రియాంక చోప్రా. ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. ఒకవేళ బిడ్డ పుడితే కెరీర్ ను కాస్త తగ్గించుకోవడానికి తనకు, నిక్ కు ఎలాంటి అభ్యంతరం లేదని, ఈ మేరకు ఇద్దరం కలిసి చర్చించుకున్నామని ప్రకటించింది. అప్పుడామె ఎందుకలా స్పందించిందో ఇప్పుడు అందరికీ తెలిసొచ్చింది.

ప్రస్తుతం చాలామంది బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలు సరోగసీ ద్వారానే పిల్లల్ని కంటున్నారు. షారూక్ ఖాన్, గౌరీఖాన్ దంపతులు చాలా ఏళ్ల కిందటే ఈ పద్ధతిలో కొడుక్కి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?