పుకార్లు నమ్మకండి.. పులి వచ్చేస్తోంది

భగవంత్ కేసరి చెప్పిన టైమ్ కు వచ్చేస్తోంది. అదే టైమ్ లో రావాల్సిన టైగర్ నాగేశ్వరరావు మాత్రం చెప్పిన టైమ్ కు రావడం లేదంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అక్టోబర్ 20న రావాల్సిన ఆ సినిమా…

భగవంత్ కేసరి చెప్పిన టైమ్ కు వచ్చేస్తోంది. అదే టైమ్ లో రావాల్సిన టైగర్ నాగేశ్వరరావు మాత్రం చెప్పిన టైమ్ కు రావడం లేదంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అక్టోబర్ 20న రావాల్సిన ఆ సినిమా వాయిదా పడే అవకాశాలున్నట్టు కథనాలు వచ్చాయి. దీంతో వెంటనే యూనిట్ స్పందించింది.

టైగర్ నాగేశ్వరరావు విడుదలపై వస్తున్న పుకార్లను ఖండించింది అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ. తమ సినిమా విడుదల తేదీపై నిరాధారమైన ఆరోపణలు వస్తున్నాయని, కొన్ని శక్తులు ఈ పుకార్లను సృష్టిస్తున్నాయని, తమ సినిమా చెప్పిన టైమ్ కే అక్టోబర్ 20న థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు.

మార్కెట్ నుంచి తమ సినిమాకు మంచి ఆఫర్లు వస్తున్నట్టు ప్రకటించారు నిర్మాత. అంతా తమ సినిమాకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని, ఓ మంచి థియేట్రికల్ ఫీలింగ్ ఇచ్చేందుకు చాలా కష్టపడుతున్నామని, అక్టోబర్ 20 నుంచి బాక్సాఫీస్ వద్ద టైగర్ వేట మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు.

రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్నాళ్ల కిందట రాజమండ్రి బ్రిడ్జ్ పై నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, కాన్సెప్ట్ వీడియో లాంఛ్ చేయడం ద్వారా ప్రచారాన్ని ప్రారంభించారు. త్వరలోనే టైగర్ నాగేశ్వరరావు టీజర్ రాబోతోంది. నుపురు సనన్, గాయత్రి భరధ్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.