Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఇస్మార్ట్ వివాదంపై పూరి రియాక్షన్

ఇస్మార్ట్ వివాదంపై పూరి రియాక్షన్

ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంబంధించి ఆ మధ్య ఓ వివాదం బాగా నడిచింది. సినిమా కథను ఓ వెబ్ సైట్ లో పెట్టేశారు. ఆ తర్వాత యూనిట్ కు బ్లాక్ మెయిల్ కాల్స్ కూడా వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై దర్శకనిర్మాత పూరి జగన్నాధ్ స్పందించాడు.

"ఇస్మార్ట్ శంకర్ స్క్రిప్ట్ మాకు తెలుసు. మాకు డబ్బులు ఇవ్వండి. లేకపోతే బయటపెట్టేస్తాం అంటూ కొంతమంది బ్లాక్ మెయిల్ చేశారు. దీనిపై పోలీస్ కంప్లయింట్ ఇచ్చాం. ఓ వెబ్ సైట్ లో వచ్చిన కథను కూడా తొలిగించాం. ప్రొడ్యూసర్ గా మారిన తర్వాత ఇలాంటి కష్టాలు తప్పవు. ఆ సమస్యలన్నీ ఇప్పుడు క్లియర్ అయిపోయాయి."

మరోవైపు తన సినిమా క్లిప్పింగులు ముందుగానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంపై పూరి జగన్నాధ్ బాధ వ్యక్తంచేశాడు. బయట షూటింగ్స్ చేస్తున్నప్పుడు అలాంటివి తప్పవని, ఇండియన్స్ ను మార్చలేమని అన్నాడు.

"చార్మినార్ లో షూటింగ్ చాలా ఇబ్బంది పెట్టింది. ఇండియాలో పబ్లిక్ లో షూటింగ్ ఎప్పుడూ కష్టమే. చార్మినార్ లాంటి ప్లేసుల్లో ఇంకా కష్టం. జనం మీద పడుతుంటారు. అన్నింటికంటే మాకు పెద్ద టెన్షన్ ఏంటంటే.. కొన్ని వందల మంది వీడియోలు తీసేసి వెంటనే ఫేస్ బుక్ లో పెట్టేస్తుంటారు. అది చాలా ప్రాబ్లమ్. మన ఇండియన్స్ అంతా అంతే."

ఈసారి తన సినిమాకు మహిళా సంఘాల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదంటున్నాడు పూరి. మరీ ముఖ్యంగా రెండో ట్రయిలర్ రిలీజ్ అయిన తర్వాత ఎక్కువమంది అమ్మాయిలే తనకు ఫోన్ చేసి చాలా బాగుందని చెబుతున్నారని.. ఈసారి తన సినిమాకు మహిళల నుంచి ఇబ్బందులు రావని అంటున్నాడు. గురువారం ఇస్మార్ట్ శంకర్ థియేటర్లలోకి రానుంది.

పరిటాల సునీతకు కోరుకున్నది దక్కింది.. ఉంటారా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?