‘పుష్ప’ ను ‘మైత్రీ’ వదిలేదేలే!

బంగారు బాతు దొరికితే రోజూ ఓ గుడ్డు తీసుకోవడం తెలివైన వారి లక్షణం. అంతే తప్ప ఒకేసారి కోసేసి తినేయడం కాదు. మైత్రీ సంస్థ అధినేతలు తెలివైన వారు. అందుకే వారికి అందిన బంగారు…

బంగారు బాతు దొరికితే రోజూ ఓ గుడ్డు తీసుకోవడం తెలివైన వారి లక్షణం. అంతే తప్ప ఒకేసారి కోసేసి తినేయడం కాదు. మైత్రీ సంస్థ అధినేతలు తెలివైన వారు. అందుకే వారికి అందిన బంగారు బాతు ‘పుష్ప’ ను అంత సులువుగా వదులుకోవడం లేదు.

పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ అయింది. కానీ అప్పట్లో పెద్దగా లాభాలు తినడం సాధ్యం కాలేదు. దానికి అనేకానేక కారణాలు వున్నాయి. ఇప్పుడు పుష్ప 2 విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా నిర్మాణం భారీ. అలాగే లాభాలు భారీగా వుంటాయి. దానికి తగినట్లే దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ వాటాలు కూడా భారీగానే వుంటాయి.

అందుకే ఇప్పుడు పుష్ప 3 కూడా ప్లాన్ చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల బోగట్టా. పుష్ప 3 అన్నది ఫిక్స్. అందులో సందేహం లేదు అన్నది నిర్మాణ వర్గాల బోగట్టా.

పుష్ప సినిమా ప్రస్తుతం క్లయిమాక్స్ షూట్ లో వుంది. సినిమాను ఆగస్ట్ లో విడుదల చేస్తారు. ఆ సినిమా తరువాత సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా వుంటుంది. కానీ చాలా టైమ్ పడుతుంది. ఎందుకంటే రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న గేమ్ ఛేంజర్ పూర్తి కావాలి. తరువాత బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా పూర్తి కావాలి. ఆ తరువాత సంగతి సుకుమార్ సినిమా. అంటే కనీసం మరో ఏడాది తరువాత.

అందువల్ల పుష్ప 3 స్టార్ట్ అయ్యే లోగా బన్నీ కనీసం రెండు సినిమాలు ఫినిష్ చేసేస్తారు. కథలు, దర్శకులు దొరకాలే కానీ. బహుశా ఆ ప్రాజెక్ట్ లు అట్లీ, త్రివిక్రమ్ సినిమాలు కావచ్చు. అంటే పుష్ప 3 ని చూడాలంటే 2027 రావాల్సి వుంటుంది.