క‌రోనాను జ‌యించిన రాజ‌శేఖ‌ర్, డిశ్చార్జ్

క‌రోనా బారిన ప‌డి ఆరోగ్య ప‌రంగా ఇబ్బందిని ఎదుర్కొన్న ప్ర‌ముఖ న‌టుడు రాజశేఖ‌ర్ విష‌యంలో సానుకూల వార్త ఇది. ఆయ‌న క‌రోనా నుంచి కోలుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విష‌యాన్ని ఆయ‌న…

క‌రోనా బారిన ప‌డి ఆరోగ్య ప‌రంగా ఇబ్బందిని ఎదుర్కొన్న ప్ర‌ముఖ న‌టుడు రాజశేఖ‌ర్ విష‌యంలో సానుకూల వార్త ఇది. ఆయ‌న క‌రోనా నుంచి కోలుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విష‌యాన్ని ఆయ‌న భార్య జీవిత ప్ర‌క‌టించారు.

ఇటీవ‌లే రాజ‌శేఖ‌ర్ కుటుంబం మొత్తం కోవిడ్-19 బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. జీవిత‌, వారి పిల్ల‌లు క‌రోనా నుంచి సుల‌భంగానే కోలుకున్నా.. రాజ‌శేఖ‌ర్ మాత్రం ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితిని ఎదుర్కొన్న‌ట్టుగా ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఆసుప‌త్రిలోనే ఉంటూ చికిత్స తీసుకున్నారు.

ఒక ద‌శ‌లో రాజ‌శేఖ‌ర్ క‌రోనా వ‌ల్ల క్రిటిక‌ల్ స్టేజ్ కు వెళ్లార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే చికిత్స‌తో ఆయ‌న క్ర‌మంగా కోలుకున్నారు. ఆరోగ్యవంతుల‌య్యారు.

క‌రోనా ప‌రీక్ష‌ల్లో నెగిటివ్ రిజ‌ల్ట్ రావ‌డంతో ఆయ‌న‌ను డిశ్చార్జ్ చేశారు వైద్యులు. వైద్యుల స‌హ‌కారంతో రాజ‌శేఖ‌ర్ కోలుకున్నార‌ని జీవిత ప్ర‌క‌టించారు.