రామ్ కొత్త సినిమా ‘రెడ్’

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేసి, మళ్లీ ట్రాక్ మీదకు వచ్చేసాడు హీరో రామ్. తనతో రెండు సినిమాలు గతంలో చేసిన డైరక్టర్ కిషోర్ తిరుమలనే మళ్లీ డైరక్టర్ గా ఎన్నుకున్నాడు. శ్రీ…

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేసి, మళ్లీ ట్రాక్ మీదకు వచ్చేసాడు హీరో రామ్. తనతో రెండు సినిమాలు గతంలో చేసిన డైరక్టర్ కిషోర్ తిరుమలనే మళ్లీ డైరక్టర్ గా ఎన్నుకున్నాడు. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై 'స్రవంతి' రవికిషోర్‌ నిర్మించనున్న ఈ చిత్రానికి 'రెడ్‌' అనే టైటిల్‌ ప్రకటించారు.

టైటిల్ ప్రకటన సందర్భంగా 'స్రవంతి' రవికిషోర్‌ మాట్లాడుతూ ''ఇప్పటి వరకూ రామ్‌ చేసిన సినిమాలకు పూర్తి విభిన్నంగా ఉంటుంది. రామ్‌ – తిరుమల కిషోర్‌ కాంబినేషన్‌లో ఇది మూడోచిత్రం. 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' విజయాల తర్వాత వాళ్లిద్దరి కాంబినేషన్‌లో మళ్లీ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది.

మా సంస్థలో ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ పనిచేయడం ఇదే తొలిసారి. నవంబర్‌ 16 నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. ఇతర తారాగణం వివరాలు త్వరలోనే తెలియజేస్తాం'' అని తెలిపారు.

ఐదేళ్లపాటు నిండా ముంచేశారని ప్రజలు నమ్మారు