రణబీర్ సరసన రష్మిక.. నిజమేనా?

టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతూనే, మరోవైపు బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది రష్మిక. ప్రస్తుతం 2 సినిమాలు చేస్తోంది. ఆ రెండూ ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చేశాయి. వీటిలో ఒక్క సినిమా…

టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతూనే, మరోవైపు బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది రష్మిక. ప్రస్తుతం 2 సినిమాలు చేస్తోంది. ఆ రెండూ ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చేశాయి. వీటిలో ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకముందే, ఆమెకు బాలీవుడ్ నుంచి మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో రష్మికపై పుకార్లు కూడా ఎక్కువవుతున్నాయి.

తాజా ఊహాగానం ఏంటంటే.. త్వరలోనే రణబీర్ కపూర్ సరసన రష్మిక నటించబోతోందట. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా ఓ సినిమా లాక్ అయింది. ఇందులో హీరోయిన్ గా పరిణీతి చోప్రాను తీసుకున్నారు. అయితే ఆమెను తప్పించారంట. ఆ స్థానంలో రష్మికను తీసుకుబోతున్నారనేది తాజా టాక్.

రణబీర్ లాంటి హీరో సరసన ఛాన్స్ అంటే రష్మిక బాలీవుడ్ కెరీర్ కు కచ్చితంగా అది పెద్ద హెల్ప్ అవుతుంది. కానీ ప్రస్తుతానికి ఆ వార్తల్లో నిజం లేదని కొట్టి పారేస్తోంది రష్మిక టీమ్.

గుడ్ బై, మిషన్ మజ్ను అనే సినిమాలు చేస్తోంది రష్మిక. ఈ 2 ప్రాజెక్టులు తప్ప, మరో హిందీ సినిమాకు ఆమె సైన్ చేయలేదంటున్నారు రష్మిక పీఆర్ జనాలు. సందీప్ రెడ్డి వంగ హిందీ సినిమాలో ఆమె నటించనుందనే వార్తలో నిజం లేదని కొట్టి పారేస్తున్నారు.

తెలుగులో ఆమె పుష్ప-2 సినిమా చేయాల్సి ఉంటుంది. ఆ మూవీ షూటింగ్ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. ఆ సినిమా షెడ్యూల్స్, దానికి తను ఇచ్చే కాల్షీట్లు సెట్ అయిన తర్వాత.. తన కొత్త సినిమా వివరాల్ని రష్మిక ప్రకటించనుంది. తెలుగులో రీసెంట్ గా ఆమె చేసిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఫ్లాప్ అయింది.