Advertisement

Advertisement


Home > Movies - Movie News

రవితేజ ఒక్క రోజు కూడా షూటింగ్ కు రాలేదు

రవితేజ ఒక్క రోజు కూడా షూటింగ్ కు రాలేదు

రవితేజకు సినిమాలే లోకం. గ్యాప్ తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే, మరో సినిమా మొదలుపెడతాడు. అలా చేతిలో మినిమం 3 సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. ఇలాంటి హీరో ఒక్క రోజు కూడా షూటింగ్ కు హాజరుకాలేదు. ఆ సినిమా ఏంటో తెలుసా.. మట్టి కుస్తీ.

మట్టి కుస్తీ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు రవితేజ. డబ్బులు పెట్టి సినిమా తీస్తున్న ఏ నిర్మాత అయినా లొకేషన్ లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ హీరో మాత్రం తను నిర్మించే సినిమా సెట్స్ పైకి ఒక్క రోజు కూడా వెళ్లలేదంట.

ఈ విషయాన్ని మట్టి కుస్తీ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి చెబుతోంది. సినిమా సెట్స్ పై ఉన్నన్ని రోజులూ ఒక్కసారి కూడా రవితేజను చూడలేదంట ఈ భామ. తన నిర్మాత అయిన రవితేజను తొలిసారి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లోనే చూసిందట.

అయితే రవితేజ ఇలా వ్యవహరించడానికి కారణాన్ని కూడా బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. హీరోగా నటించిన విష్ణు విశాల్, ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. దీంతో విష్ణు విశాల్ పై నమ్మకంతో నిర్మాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదంట రవితేజ. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?