రెండేళ్ల తరువాత ఫ్యాన్స్ ముందుకు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ముందుకు రాబోతున్నారు. అదీ రెండేళ్లకు పైగా గ్యాప్ తరువాత. ఈ మధ్యలో కొందరు కలిసి వుండొచ్చు. చూసి వుండొచ్చు. వేరే ఫంక్షన్ కు వచ్చి వుండొచ్చు. కానీ…

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ముందుకు రాబోతున్నారు. అదీ రెండేళ్లకు పైగా గ్యాప్ తరువాత. ఈ మధ్యలో కొందరు కలిసి వుండొచ్చు. చూసి వుండొచ్చు. వేరే ఫంక్షన్ కు వచ్చి వుండొచ్చు. కానీ మహేష్ తన సినిమా ఫంక్షన్ కు హాజ‌రై రెండేళ్ల కన్నా ఎక్కువగా గ్యాప్ నే వచ్చేసింది. కరోనా పుణ్యం ఇది.

సర్కారు వారి పాట సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ఫ్యాన్స్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పుష్ప తరువాత మళ్లీ ఆ రేంజ్ లో ఫ్యాన్స్ హాజ‌రుకాబోయే ఈవెంట్ ఇది. ఈ నెల 7 లేదా 8న ఈ ఈవెంట్ యూసఫ్ గుడా పోలీస్ గ్రవుండ్స్ లో వుంటుందని తెలుస్తోంది. 

యూనిట్ రెండు డేట్ లకు పోలీస్ అనుమతి కోరినట్లు తెలుస్తోంది. ఏ డేట్ కు అనుమతి వస్తే ఆ డేట్ కు ఫంక్షన్ వుంటుంది. శనివారం అయిన 7నే ఫంక్షన్ వుండే అవకాశం వుందని వినిపిస్తోంది.

పుష్ప సినిమా ఫంక్షన్ కు జ‌నాలు ఎక్కువ మంది రావడంతో పోలీసులు సినిమా ఫంక్షన్లకు అనుమతి ఇచ్చే విషయంలో కాస్త స్ట్రిక్ట్ గా వుంటున్నారు. అందువల్ల పాస్ లు పరిమిత సంఖ్యలో వుండే అవకాశం వుంది.

ప్రస్తుతం హాలీడే టూర్ లో వున్నారు మహేష్ అండ్ ఫ్యామిలీ. ఆయన వచ్చిన తరువాత ఫంక్షన్ హైలైట్స్ ఫిక్స్ అవుతాయి. ప్రస్తుతానికి వినిపిస్తున్న వార్తల ప్రకారం కేవలం యూనిట్ కే ఈ ఫంక్షన్ పరిమితం అవుతుందని తెలుస్తోంది. 

రాజ‌మౌళి, త్రివిక్రమ్ సినిమాలు లైన్ లో వున్నందున వారు హాజ‌రవుతారా? అన్నది చూడాలి. మహేష్ పిలిస్తే రాకుండా వుండేది లేదు.