Advertisement

Advertisement


Home > Movies - Movie News

తనదైన శైలిలో కౌంటర్ వేసిన వర్మ

తనదైన శైలిలో కౌంటర్ వేసిన వర్మ

సీఎం జగన్ పై జరిగిన దాడిని జాతి మొత్తం ఖండిస్తోంది. దేశ ప్రధాని నుంచి సామాన్య పౌరుడి వరకు అందరూ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. కానీ టీడీపీ, జనసేన నేతలు మాత్రం ఎలా స్పందించాలో తెలియక కిందామీద పడుతున్నారు.

దీన్ని కూడా రాజకీయం చేయాలని కొందరు టీడీపీ నేతలు ప్రయత్నిస్తుంటే, మరికొంతమంది పెట్టిన పోస్టులు డిలీట్ చేస్తున్నారు. ఇంకొంతమంది మరోసారి తమ బుద్ధి చాటుకుంటున్నారు. అలా తన బుద్ధి చూపించిన లోకేష్ కు తనదైన శైలిలో కౌంటర్ వేశాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

జగన్ పై జరిగిన ఈ దాడిని డ్రామాగా అభివర్ణించాడు లోకేష్. "రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్? ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా" అంటూ పోస్టు పెట్టిన లోకేశ్, కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్ అంటూ తన బుద్ధిని చాటుకున్నాడు.

దీనిపై రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా స్పందించాడు. లోకేష్ కు ఇన్నాళ్లూ బుర్ర లేదని భావించానని, ఈ పోస్టుతో అతడికి హృదయం లేదని కూడా అర్థమైందన్నాడు.

"ఈ పోస్టుతో ఒక్క విషయం స్పష్టమైంది. నీకు బుర్ర మాత్రమే కాదు, హృదయం కూడా లేదు. అంత కచ్చితత్వంతో రాయిని, అంత సున్నితమైన భాగంపైకి ఎలా విసిరారో నీకున్న కొద్దిపాటి జ్ఞానంతో వివరించగలవా? ఆ రాయి కంటికి తగిలితే ఏమయ్యేది? అప్పుడు కూడా అది జగన్ ప్లానే అనుకునేవాడివా?"

ఇలా లోకేష్ పై విరుచుకుపడ్డారు ఆర్జీవీ. తన సినిమాలతో ఇప్పటికే లోకేష్ పై లెక్కలేనని సెటైర్లు వేసిన వర్మ, ఇప్పుడిలా లోకేష్ ట్వీట్ పై తీవ్రస్థాయిలో స్పందించాడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?