సాయిపల్లవి-చైతన్య జోడీ మరోసారి

ప్రేమమ్ సినిమా రీమేక్ టైమ్ లో చైతన్య సరసన సాయి పల్లవిని తీసుకోవడానికి ఆలోచనలు జరిగాయి. కానీ టోటల్ గా డామినేషన్ అయిపోతుందేమో అన్న పాయింట్ లు డిస్కషన్ కు వచ్చాయి. కట్ చేస్తే,…

ప్రేమమ్ సినిమా రీమేక్ టైమ్ లో చైతన్య సరసన సాయి పల్లవిని తీసుకోవడానికి ఆలోచనలు జరిగాయి. కానీ టోటల్ గా డామినేషన్ అయిపోతుందేమో అన్న పాయింట్ లు డిస్కషన్ కు వచ్చాయి. కట్ చేస్తే, ఆ తరువాత సాయి పల్లవి ఫుల్ పాపులర్ అయింది తెలుగులో. లవ్ స్టోరీ సినిమాతో చైతూ-సాయిపల్లవి హిట్ పెయిర్ అయింది. ఆ తరువాత మళ్లీ ఇన్నాళ్లకు ఆ పెయిర్ మరోసారి తెరమీదకు వస్తోంది.

చందు మొండేటి-బన్నీవాస్ కలిసి నిర్మిస్తున్న సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకున్నారు. ఈ మేరకు వదలిన వదిలిన విడియోలో ఆమెను డైరెక్ట్ గా చూపించకపోయినా, జస్ట్ చేతులు మాత్రం చూపించారు. అయితే విశ్వసనీయ వర్గాలు మాత్రం ఆ సమావేశానికి సాయి పల్లవి హాజరయిందని తెలిపాయి. ఈ సినిమాకు సంగీతం సమకూర్చుకూర్చేందుకు ఎఆర్ రెహమాన్..అనిరుధ్ ల పేర్లు పరిశీలిస్తున్నారని బోగట్టా.

గత కొంతకాలంగా గీతా సంస్థ సరైన హిట్ కోసం చూస్తోంది. ఇలాంటి టైమ్ లో చందు మొండేటికి పది కోట్ల భారీ రెమ్యూనిరేషన్ ఇచ్చి ఈ సినిమా చేస్తోంది. ఇండియా-పాకిస్ధాన్-సముద్రం మీద జరిగే కథ ఇది అని తెలుస్తోంది. 

ఇండియన్ మత్స్యకారుడు పాకిస్థాన్ జలాల్లోకి పొరపాటున వెళ్లి అక్కడ ఖైదు కావడం, అతగాడి ప్రేమ కథ ఇవన్నీ ఈ సినిమాలో వుంటాయని రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య వచ్చిన సీతారామం సినిమా లో కూడా ఇలాంటి పాయింట్ ఒకటి వున్న సంగతి తెలిసిందే.