సాయితేజ్ తో రాశీఖన్నా

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో రాశీఖన్నా మరోసారి జతకట్టబోతోంది. 2019 చివరిలో ప్రతి రోజూ పండగే సినిమాతో హిట్ కొట్టిందీ జంట. సుకుమార్ రైటింగ్స్ లో నిర్మించే సినిమాకు మళ్లీ రాశీనే…

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో రాశీఖన్నా మరోసారి జతకట్టబోతోంది. 2019 చివరిలో ప్రతి రోజూ పండగే సినిమాతో హిట్ కొట్టిందీ జంట. సుకుమార్ రైటింగ్స్ లో నిర్మించే సినిమాకు మళ్లీ రాశీనే హీరోయిన్ గా తీసుకుంటున్నారు. 

రాశీఖన్నా ను ఇటీవలే గోపీచంద్ సినిమా కోసం కూడా అడిగారు. కానీ ఈలోగా గోపీచంద్ నో అన్నాడని వార్తలు వచ్చాయి. కాదు రాశీనే నో అన్నదనే ఖండనలు కూడా వినిపించాయి. చేతిలో పెద్దగా సినిమాలు లేని రాశీ ఎందుకు గోపీచంద్ ను నో అంటుందన్నది క్వశ్చను.

రాశీ పెద్దగా రెమ్యూనిరేషన్ డిమాండ్ చేయడం లేదు. గతంలో 75 లక్షల వరకు తీసుకుంది కానీ ఇప్పుడు బాగా తక్కువకే చేస్తోందని టాక్ వుంది. అందుకే గోపీచంద్ సినిమాలో రాశీని తీసుకోవాలని మారుతి అనుకున్నట్లు కనిపిస్తోంది. 

ఎందుకంటే ఆ సినిమాను చాలా మినిమమ్ బడ్జెట్ లో చేసే ప్లానింగ్ లో వున్నారని టాక్ వుంది. మొత్తానికి మారుతి డైరక్షన్ లో గోపీచంద్ సరసన రాశీ వుంటుందా? వుండదా? అన్న క్వశ్చను అలాగే వుంది. ఈలోగా సాయి తేజ్ తో ఓ సినిమాకు ఓకె అనేసినట్లు తెలుస్తోంది.

ఏపీలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలయ్యేనా?

క‌థ మొత్తం బంగారం చూట్టే