‘సంతాన ప్రాప్తిరస్తు’ సాంగ్ లాంచ్

‘నాలో ఏదో..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘ నాలో ఏదో మొదలైందని, నీతో చెలిమే రుజువైందని, కనులే చెబితే మనసే వినదా, నిజమే అనదా…’ అంటూ సాగుతుందీ పాట.

విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ “సంతాన ప్రాప్తిరస్తు”. ఇటీవల టీజర్ విడుదల చేసారు. ఇప్పుడు ఓ పాట విడుదల చేసారు. ‘నాలో ఏదో..’ లిరికల్ సాంగ్ ను రేడియో మిర్చిలో లాంచ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ మంచి ట్యూన్ ఇవ్వగా.. శ్రీజో క్యాచీ లిరిక్స్ అందించారు. సింగర్స్ దినకర్ కల్వల, అదితి భావరాజు ఆకట్టుకునేలా పాడారు.

‘నాలో ఏదో..’ పాట ఎలా ఉందో చూస్తే – ‘ నాలో ఏదో మొదలైందని, నీతో చెలిమే రుజువైందని, కనులే చెబితే మనసే వినదా, నిజమే అనదా…’ అంటూ సాగుతుందీ పాట. హీరో హీరోయిన్స్ విక్రాంత్, చాందినీ చౌదరిపై లవ్ సాంగ్ గా ఈ పాటను చిత్రీకరించారు.

పాట లాంచ్ కార్యక్రమంలో హీరో విక్రాంత్, ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ సంజీవ్ రెడ్డి, లిరిసిస్ట్ శ్రీజో, సింగర్ అదితి భావరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లిరికిస్ట్ శ్రీజో, సింగర్ అదితి భావరాజు, హీరో విక్రాంత్, నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, దర్శకుడు సంజీవ్ రెడ్డి తదితరులు ప్రసంగించారు.

“సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు.