ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు క‌న్నుమూత‌

భాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు స‌తీష్ కౌశిక్ ఈ రోజు తెల్ల‌వారుజామున క‌న్నుముశారు. ఈ విషయాన్ని నటుడు అనుపమ్ ఖేర్ ట్వీట్ట‌ర్ ద్వారా తెలియజేశారు. తమ 45 ఏళ్ల స్నేహం ఈరోజు ముగిసిందంటూ అనుపమ్…

భాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు స‌తీష్ కౌశిక్ ఈ రోజు తెల్ల‌వారుజామున క‌న్నుముశారు. ఈ విషయాన్ని నటుడు అనుపమ్ ఖేర్ ట్వీట్ట‌ర్ ద్వారా తెలియజేశారు. తమ 45 ఏళ్ల స్నేహం ఈరోజు ముగిసిందంటూ అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు.

స‌తీష్ కౌశిక్ హ‌రియాణాలోని మ‌హేంద్ర‌గ‌ఢ్ లో 1956 లో జ‌న్మించిన ఆయ‌న‌.. 1983లో మ‌సూమ్ చిత్రంలో యాక్టింగ్ కేరీర్ ప్రారంభించారు. తేరే నామ్, వాదా వంటి ప‌దికిపైగా చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 2007లో స‌తీష్ కౌశిక్, త‌న స్నేహితుడు అనుప‌మ్ ఖేర్‌తో క‌లిసి కరోల్ బాగ్ అనే కొత్త ప్రొడక్షన్స్ కంపెనీని ప్రారంభించారు. మొదటి చిత్రం తేరే నామ్ కి సతీష్ కౌశిక్ దర్శకత్వం వహించారు.

స్కాం 1992 వెబ్ సిరీస్.. ఎమ‌ర్జెన్సీ, మిస్ట‌ర్ ఇండియా, ఉడ్తా పంజాబ్ వంటి ప‌లు చిత్రాల్లో న‌టించారు. సతీష్ కౌశిక్ సొంత రాష్ట్రం హర్యానాలో చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడానికి కృషి చేశారు. స‌తీష్ మృతి ప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.