సెట్ మీదకు పూరి-రామ్ సినిమా

లైగర్ సినిమా విడుదలై 11 నెలలు కావస్తోంది. అప్పటి నుంచి ఖాళీగా వున్నారు దర్శకుడు పూరి జగన్నాధ్. ఇప్పుడు మళ్లీ టైమ్ వచ్చింది. ఓ పకడ్బందీ స్క్రిప్ట్ తో సినిమా స్టార్ట్ చేస్తున్నారు.  Advertisement…

లైగర్ సినిమా విడుదలై 11 నెలలు కావస్తోంది. అప్పటి నుంచి ఖాళీగా వున్నారు దర్శకుడు పూరి జగన్నాధ్. ఇప్పుడు మళ్లీ టైమ్ వచ్చింది. ఓ పకడ్బందీ స్క్రిప్ట్ తో సినిమా స్టార్ట్ చేస్తున్నారు. 

హీరో రామ్ తో డబుల్ ఇస్మార్ట్ సినిమాను ఇఫ్పటికే ప్రకటించేసారు. ఇప్పుడు ఆ సినిమా సెట్ మీదకు వెళ్లబోతోంది. ఈ నెల 9 ను రామ్-పూరి సినిమా ఓపెనింగ్ కార్యక్రమం వుంటుంది. ఆ తరువాత 12 నుంచి రెగ్యులర్ షూట్ వుంటుంది. ఈ సినిమా మిగిలిన సంగతులు ఇంకా తెలియాల్సి వుంటుంది.

ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా వస్తుందా.. ఫ్రాంచైజీగా వుంటుందా అన్నది తెలియాల్సి వుంది. కథ అయితే పూరి చాలా కసిగా రాసుకున్నారని, బాగా వచ్చిందని ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. గత ఏడాది కాలంలో వేరే ఆఫర్లు వచ్చినా, కేవలం నిర్మాతగా కూడా తామే వుండాలనే ఆలోచనతో అన్నింటినీ వదులుకున్నారు పూరి జగన్నాధ్. లేదంటే ఎప్పుడో సినిమా స్టార్ట్ అయి వుండేది.

తనకు సరైన టైమ్ లో సరైన హిట్ ఇచ్చిన పూరి ని కష్ట కాలంలో ఆదుకుంటున్నాడు రామ్ పోతినేని. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మళ్లీ మరోసారి బ్లాక్ బస్టర్ ఇస్తారా అన్నది చూడాలి.