బాయ్ ఫ్రెండ్ తో అంబానీ పెళ్లికి హాజరైన హీరోయిన్

హీరోయిన్లంతా తమ బాయ్ ఫ్రెండ్స్ ను ఘనంగా మీడియాకు పరిచయం చేస్తున్న రోజులివి. బ్రేకప్ అయినా అంతే. ఇలాంటి టైమ్ లో కూడా తన ప్రేమను సీక్రెట్ గా ఉంచుతోంది హీరోయిన్ శ్రద్ధా కపూర్.…

హీరోయిన్లంతా తమ బాయ్ ఫ్రెండ్స్ ను ఘనంగా మీడియాకు పరిచయం చేస్తున్న రోజులివి. బ్రేకప్ అయినా అంతే. ఇలాంటి టైమ్ లో కూడా తన ప్రేమను సీక్రెట్ గా ఉంచుతోంది హీరోయిన్ శ్రద్ధా కపూర్. బాలీవుడ్ లో భారీ క్రేజ్ తో దూసుకుపోతున్న ఈ భామ, రైటర్ రాహుల్ మోడీతో కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తోంది.

అయితే ఈ విషయాన్ని ఆమె ఎక్కడా బయటపెట్టలేదు. మీడియా మాత్రం వీళ్లిద్దరూ కలిసున్న ఫొటోల్ని ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేస్తూనే ఉంది. తాజాగా అనంత అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు కూడా బాయ్ ఫ్రెండ్ తో కలిసి హాజరైంది శ్రద్ధా కపూర్.

తన వ్యక్తిగత విషయాల్ని బయటపెట్టడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని గతంలోనే ప్రకటించింది శ్రద్ధా. ఆమె రోహన్ శ్రేష్ఠతో డేటింగ్ చేసినప్పుడు కూడా ఇలానే గుంభనంగా వ్యవహరించింది. ఇప్పుడు రోహన్ శ్రేష్ఠతో రిలేషన్ షిప్ లో ఉన్న విషయాన్ని కూడా ఆమె బయటకు చెప్పడం లేదు.

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనేందుకు బాయ్ ఫ్రెండ్ తో కలిసి జామ్ నగర్ వెళ్లింది శ్రద్ధా కపూర్. ఇద్దరూ కలిసి కారు దిగారు. ఎప్పుడైతే మీడియా ఉందని తెలిసిందో, వెంటనే బాయ్ ఫ్రెండ్ ను పక్కకు పంపించింది. తను సింగిల్ గా మీడియా ముందుకొచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్ ను కొంతమంది తమ మొబైల్స్ లో చిత్రీకరించారు.

సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ బ్యూటీ, ప్రస్తుతం పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైంది. రీసెంట్ గా ముంబయిలో ఓ ఖరీదైన ఫ్లాట్, అదే టైమ్ లో ఖరీదైన కారు కూడా కొనుగోలు చేసింది.