Advertisement

Advertisement


Home > Movies - Movie News

పెళ్లయిన ఏడాదికే హీరోయిన్ విడాకులు

పెళ్లయిన ఏడాదికే హీరోయిన్ విడాకులు

గతేడాది సరిగ్గా ఇదే టైమ్ కు పెళ్లి చేసుకుంది నటి శ్వేతాబసు ప్రసాద్. మరో 3 రోజుల్లో మొదటి వివాహ వార్షికోత్సవాన్ని గ్రాండ్ గా జరుపుకోవాల్సిన అకేషన్. కానీ అందర్నీ షాక్ కు గురిచేస్తూ, పెళ్లయిన ఏడాదికే తన భర్తతో విడిపోతున్నట్టు ప్రకటించింది శ్వేతాబసు. తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. భర్త రోహిత్ మిట్టల్, తను పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు ప్రకటించింది.

తెలుగులో పూర్తిగా అవకాశాలు కోల్పోయిన శ్వేతాబసు, బాలీవుడ్ లో కొన్ని సినిమాలకు డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసింది. అదే టైమ్ లో రోహిత్ మిట్టల్ లో పరిచయమైంది. గతేడాది పూణెలో వీళ్లు పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లి చేసుకున్న ఏడాదికే ఈ జంట విడిపోతోంది. వీళ్లు విడిపోవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు.

తామిద్దరం విడిపోతున్న విషయాన్ని శ్వేతబసు అధికారికంగా ప్రకటించింది. ఇకపై ఎవరి జీవితాలు వాళ్లవి అంటూ కాస్త వేదాంత కూడా వల్లించింది. ఈ ఏడాది కాలంలో తనకు మధుర జ్ఞాపకాలు అందించినందుకు రోహిత్ కు థ్యాంక్స్ కూడా చెప్పింది. జీవితంలో రోహిత్ కు ఎప్పుడూ ఓ ఛీర్ లీడర్ లా ఉంటానని తెలిపింది. కొత్తబంగారులోకం సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్వేతాబసు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?