Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఒకే బ్యానర్ పై పవన్, ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్

ఒకే బ్యానర్ పై పవన్, ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్

ఒకప్పుడు భారీ సినిమాలు తీసింది. ప్రస్తుతం మీడియం రేంజ్ సినిమాలకే పరిమితమైంది. త్వరలోనే మరోసారి బిగ్ లీగ్ లోకి ఎంటర్ కాబోతోంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. రానున్న మూడేళ్లలో ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి అన్నీ పెద్ద సినిమాలే రాబోతున్నాయి. బన్నీ, పవన్, ప్రభాస్.. ఇలా అందరూ పెద్ద స్టార్స్ నటిస్తున్నారు.

ప్రస్తుతం బన్నీ-సుకుమార్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది మైత్రీ మూవీ మేకర్స్. దీంతో పాటు త్వరలోనే పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొస్తోంది. ఈ రెండు కాకుండా.. ప్రభాస్-కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తోంది.

ప్రస్తుతానికైతే ఫిక్స్ అయినవి ఈ 3 సినిమాలు మాత్రమే. ఇవి కాకుండా.. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్, రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్లపై కూడా చర్చలు జరుగుతున్నాయి. రంగస్థలం మేజిక్ ను రిపీట్ చేసే ప్రయత్నం ఇది. ఇలా రాబోయే కాలంలో మైత్రీ నుంచి అన్నీ పెద్ద సినిమాలే రాబోతున్నాయి.

ఒకప్పుడు బడా మూవీస్ తప్ప మీడియం రేంజ్ సినిమాలు వీళ్లు తీయరేమో అని అనుకున్నారంతా. అలాంటి బ్యానర్ కాస్తా ఒక్కసారిగా పెద్ద సినిమాల నుంచి తప్పుకుంది. సాయితేజ్, నాగచైతన్య, విజయ్ దేవరకొండ, నాని లాంటి నటులతో సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు మైత్రీకి "భారీ" లుక్ వస్తోంది.

విజయ్ కు మాత్రమే సరిపోయే కథ ఇది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?