Advertisement

Advertisement


Home > Movies - Movie News

స్పందించిన మైత్రీ మూవీస్ ?

స్పందించిన మైత్రీ మూవీస్ ?

నిన్నగాక మొన్ననే వెల్లడించాం, మెగా హీరో తొలి సినిమా ఉప్పెన రెమ్యూనిరేషన్ జస్ట్ యాభై లక్షలు మాత్రమే అని. అలాగే అదే సినిమాలో హీరోయిన్ కృతికి తొలి సినిమా రెమ్యూనిరేషన్ జస్ట్ 10 లక్షలే అని.

ఈ నేపథ్యంలో సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో మైత్రీ మూవీస్ స్పందించి హీరో హీరోయిన్లు ఇద్దరికీ కాస్త అదనపు పారితోషికం అందించినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి.

హీరోకి కోటి రూపాయిలు, హీరోయిన్ కు పాతిక లక్షలు బహుమానంగా అందించారట నిర్మాతలు. నిజానికి ఇది రివర్స్ లో అందించి వుంటే మరింత బాగుండేది.

ఎందుకంటే ఉప్పెన హిట్ ఫ్యాక్టర్లలో మ్యూజిక్ డైరక్టర్ దేవీశ్రీప్రసాద్ ఫస్ట్ ప్లేస్ లో వుంటారు. ఆ తరువాత పుల్లింగ్ ఫ్యాక్టర్ హీరోయిన్ నే. ఆమె ప్రేక్షకులను ఫిదా చేసింది.

కానీ మనది హీరో బేస్డ్ ఇండస్ట్రీ కదా. అందుకే హీరోయిన్ కు టోటల్ 35 లక్షలు, హీరోకి టోటల్ కోటిన్నర పారితోషికం అందినట్లు అయింది. 

నారావారి కుటుంబంలో మాన‌సిన స‌మ‌స్య ఉంది

ఈ సినిమా అడ‌క‌పోతే ప్రొడ్యూస‌ర్ల‌కు హ‌ర్ర‌రే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?