శ్రీకారం చేసినందుకు గర్వంగా వుంది

శర్వానంద్ హీరోగా  14రీల్స్ ప్లస్ పతాకంపై నూతన దర్శకుడు కిషోర్ బి. దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన చిత్రం శ్రీకారం. మార్చి 11న ఈ చిత్రం విడులవుతున్న సందర్భంగా  చిత్ర యూనిట్…

శర్వానంద్ హీరోగా  14రీల్స్ ప్లస్ పతాకంపై నూతన దర్శకుడు కిషోర్ బి. దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన చిత్రం శ్రీకారం. మార్చి 11న ఈ చిత్రం విడులవుతున్న సందర్భంగా  చిత్ర యూనిట్ మీడియా మీట్ ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో  హీరో శర్వానంద్‌ మాట్లాడుతూ  – ‘‘సినిమా గురించి మాట్లాడాలి అంటే..సాయిమాధవ్‌ బుర్రాగారు చెప్పినట్లు…ఈ కథ విన్నప్పుడు చేయాలి. ఇది ఒక బాధ్యత అనిపించింది. 

ఇలాంటి కథలు మళ్లీ మళ్లీ రావు. రైతులు పండిస్తే కానీ తినలేం. పండించే వారు తక్కువై పోతున్నారు. తినేవారు ఎక్కువై పోతున్నారు. ఇంత మంచి కథ రాసుకున్నందుకు థ్యాంక్స్‌ కిశోర్‌. కమర్షియల్‌ సినిమాలు చేయడం ఈజీ. కానీ నిర్మాతలు  శ్రీకారంలాంటి సినిమాను నమ్మడం  ఇంత ఖర్చు పెట్టడం చాలా కష్టం. ధైర్యం ఉంటేనే ఇలాంటి చేస్తారు. ఈ సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఫీల్‌ అవుతున్నాను.

ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది.  ఫస్ట్‌ కాల్‌నాకు చరణ్‌ నుంచి వచ్చింది. సినిమా పాయింట్‌ బాగుంది. ఈ సినిమా కోసం నేను ఏం చేయాలి? సపోర్ట్‌ చేయాలను కుంటున్నాను. ఈ సమయంలో మనం ఒకరికొకరం సపోర్ట్‌గా ఉండాలి అని నా మిత్రుడు రామ్‌చరణ్‌ చెప్పాడు. వెంటనే ఆయన చిరంజీవిగారికి చెప్పారు. చిరంజీవిగారికి మేం చూపించాము. 8న ఖమ్మంలో జరగనున్న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రావడానికి ఒప్పుకున్నారు. వెంటనే కేటీఆర్‌గారికి ఫోన్‌ చేశాం. సపోర్ట్‌ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 9న హైదరాబాద్‌లో జరగబోయే ఈవెంట్‌కు రావడానికి ఒప్పుకున్నారు. పబ్లిసిటీ అని కాదు..ఇలాంటి పెద్ద వారు చెబితే యూత్‌ ఇన్‌స్పైర్‌ అవుతారని మా నమ్మకం..అన్నారు

నిర్మాత గోపీ ఆచంట మాట్లాడుతూ – ‘‘ శ్రీకారం చాలా పాజిటివ్‌ టైటిల్‌. ఒక యువరైతు కథ. స్ట్రాంగ్‌ డైలాగ్స్, బలమైన ఎమోషన్స్‌తో ఈ సినిమాను చేశాం. మన చుట్టూ కనిపించే క్యారెక్టర్స్‌తో డిజైన్‌ చేసిన సినిమా ఇది. మిక్కీజే మేయర్‌ మంచి సంగీతం అందించారు. సాయిమాధవ్‌ బుర్రాగారు ఎమోషనల్‌ డెప్త్‌ ఉన్న సీన్స్‌కు అంతే డెప్త్‌గా ఇచ్చారు. ఈ సినిమాకు డైలాగ్స్‌ అనేవి పెద్ద ఎస్సెట్‌. 2016 నుంచి ట్రావెల్‌ అయ్యి 2019లో శ్రీకారం సినిమాను స్టార్ట్‌ చేశాం. కిశోర్‌కు మంచి భవిష్యత్‌ ఉంది అని అన్నారు.

డైరెక్టర్‌ కిశోర్‌. బి  మాట్లాడుతూ –‘‘  మనందరం దాదాపు వ్యవసాయ కుటుంబాల నుంచే వచ్చిన వాళ్లం. ఎక్కడో ఒక చోట మనం కనెక్ట్ అయి ఉంటాము. మనల్ని మనం స్క్రీన్‌ పై చూసేందుకు ఈ నెల 11న వస్తున్నాం. సినిమా చూస్తున్నప్పుడు మన కథో, మన పక్క ఊరి కథో ఏదో ఒకటి చూస్తున్న భావన కలుగుతుంది. మా సినిమాను చూసిన వారు…వారి కుటుంబసభ్యులు అందరికీ చూపించండి. ఒక షార్ట్‌ ఫిల్మ్‌ చూసి, నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్‌. నా కథను నేను స్క్రీన్‌పై చూసుకున్నట్లుగా ఫీలై ప్రతి ఒక్కరు థియేటర్ నుంచి బయటకు వస్తారు అన్నారు. 

రైటర్ సాయిమాధవ్‌బుర్రా మాట్లాడుతూ – ‘‘ శర్వానంద్‌గారికి  మళ్ళీ మళ్లీ రాని రోజు సినిమా తర్వాత శర్వానంద్‌గారితో శ్రీకారం సినిమా చేశాను. రైతు బ్యాక్‌డ్రాప్‌ సినిమా ఇది. కిశోర్‌ కథ చెప్పిన వెంటనే ఈ సినిమా చేయాలి అని అనుకున్నాను. ఇలాంటి సినిమా చేయడం నా బాధ్యత. ఒక సంతోషాన్నిచ్చే సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. బంధాలకు, భూమికి ఉన్న ప్రేమకథ చిత్రం ఇది రైతును,భూమిని కమర్షియల్‌ పాయింట్‌గా చూపించలన్న నిర్మాతలను అభినందిస్తున్నాను. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్‌ శర్వానంద్‌కు మాత్రమే సూట్‌ అవుతుంది. ఈ భూమి మీద పైసా కూడ దోచుకోలేనిది ఒక్క రైతు మాత్రమే. తండ్రికి, కొడుక్కు మధ్య ఉన్న ప్రేమకథ ఈ చిత్రం భూమికి మనిషికీ మధ్య ఉన్న ప్రేమకథ ఈ చిత్రం అన్నారు. 

ప్రియాంకా అరుల్‌ మోహనన్‌ మాట్లాడుతూ  ‘‘ ఇంత మంచి సినిమా చేసినందుకు సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు తమ ఫ్యామిలీస్‌తో వెళ్లి ఈ సినిమాను చూడండి. శర్వాందన్‌ మంచి కో స్టార్‌.మంచి సంగీతం అందించిన మిక్కి జే మేయర్‌కు థ్యాంక్స్” అన్నారు.

Click Here For Photo Gallery

కాజల్‌. సునీల్‌ శెట్టిగారికి కథ చెప్పగానే ఒప్పుకున్నారు

లోకేశ్ ప్ర‌తిమాట ఆణిముత్య‌మే