అప్పుడు రంగస్థలం.. ఇప్పుడు శేషాచలం

రంగస్థలం షూటింగ్ టైమ్.. రాజమండ్రి పరిసర ప్రాంతాలు.. ఎండలు మండిపోతున్నాయి.. సమంత ఒక్కసారిగా కళ్లుతిరిగి పడిపోయింది. ఆమెకు వడదెబ్బ తగిలింది. జనాల తాకిడితో షూటింగ్ కు కూడా ఇబ్బందులు తప్పలేదు. దీంతో రంగస్థలం అనే…

రంగస్థలం షూటింగ్ టైమ్.. రాజమండ్రి పరిసర ప్రాంతాలు.. ఎండలు మండిపోతున్నాయి.. సమంత ఒక్కసారిగా కళ్లుతిరిగి పడిపోయింది. ఆమెకు వడదెబ్బ తగిలింది. జనాల తాకిడితో షూటింగ్ కు కూడా ఇబ్బందులు తప్పలేదు. దీంతో రంగస్థలం అనే ఊరినే హైదరాబాద్ లో క్రియేట్ చేశారు. మేజర్ షూటింగ్ అందులోనే పూర్తిచేశారు.

కట్ చేస్తే, ఇప్పుడు సుకుమార్ కొత్త సినిమాకు కూడా ఇదే పరిస్థితి తలెత్తబోతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో బన్నీతో సినిమా. కచ్చితంగా శేషాచలం అడవుల్లో షూటింగ్ చేయాల్సిందే. ఈ మేరకు రెక్కీ కూడా పూర్తిచేశాడు సుకుమార్. కానీ వచ్చేది ఎండాకాలం. రంగస్థలం అనుభవం సుక్కూకు ఉండనే ఉంది.

అందుకే అప్పుడు రంగస్థలం సెట్ వేయించిన విధంగా, ఈసారి శేషాచలం అడవుల సెట్ వేయించాలని అనుకుంటున్నాడు సుకుమార్. ఈ మేరకు తన టీమ్ తో చర్చలు ప్రారంభించాడు. అడవి సెట్ వేయడం అసాధ్యం కాదు. చాలా హాలీవుడ్ సినిమాల్లో ఇది చూశాం. పైగా గ్రాఫిక్స్ ఉండనే ఉన్నాయి. కాకపోతే ఇంత తక్కువ టైమ్ లో ఎలా అనేది ప్రశ్న.

ఐకాన్ సినిమాను కొన్నాళ్లు పక్కనపెట్టి మరీ సుకుమార్ సినిమాకు కాల్షీట్లు ఇచ్చాడు బన్నీ. ఇలాంటి టైమ్ లో అతడ్ని వెయిట్ చేయించడం మంచిది కాదు. సో.. రియల్ లొకేషన్స్ లోనే కొన్నాళ్లు షూటింగ్ చేసి, ఆ తర్వాత సెట్స్ లోకి షిఫ్ట్ అవ్వాలని ప్లాన్ చేశారు. చాన్నాళ్ల తర్వాత ఈ సినిమాతో మళ్లీ భారీ బడ్జెట్ వైపు వచ్చింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.

ఇద్దరు హీరోలని కన్విన్స్ చేసాం