క‌రోనా నుంచి కోలుకున్న సీనియ‌ర్ న‌టీమ‌ణి

త‌ను క‌రోనా ల‌క్ష‌ణాల నుంచి పూర్తిగా కోలుకున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు న‌టీ, మండ్య ఎంపీ సుమ‌ల‌త‌. త‌ను క‌రోనా వైర‌స్ కు గుర‌యిన‌ట్టుగా కొన్ని రోజుల కింద‌ట సుమ‌ల‌త ప్ర‌క‌టించారు. ట్రీట్ మెంట్ తీసుకోబోతున్న‌ట్టుగా ఆమె…

త‌ను క‌రోనా ల‌క్ష‌ణాల నుంచి పూర్తిగా కోలుకున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు న‌టీ, మండ్య ఎంపీ సుమ‌ల‌త‌. త‌ను క‌రోనా వైర‌స్ కు గుర‌యిన‌ట్టుగా కొన్ని రోజుల కింద‌ట సుమ‌ల‌త ప్ర‌క‌టించారు. ట్రీట్ మెంట్ తీసుకోబోతున్న‌ట్టుగా ఆమె అప్ప‌ట్లో ప్ర‌క‌టించారు. త‌న‌కు కోవిడ్-19 పాజిటివ్ గా తేలిన విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించిన సుమ‌ల‌త‌, ఇప్పుడు త‌న‌కు క‌రోనా రిజ‌ల్ట్ నెగిటివ్ వ‌చ్చిందంటూ అక్క‌డే ప్ర‌క‌టించారు. తన‌కు వైద్యం అందించిన డాక్ట‌ర్ల‌కు, త‌న శ్రేయోభిలాషుల‌కు సుమ‌ల‌త ధ‌న్య‌వాదాలు చెబుతూ పోస్టు పెట్టారు.

మూడు వారాల పాటు త‌ను పూర్తిగా క్వారెంటైన్లో ఉన్న‌ట్టుగా సుమ‌ల‌త తెలిపారు. వైద్యుల స‌హ‌కారంతో త‌ను కోలుకున్న‌ట్టుగా, మ‌రి కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాల‌ని వారు త‌న‌కు సూచించార‌ని ఈ ఎంపీ ప్ర‌క‌టించారు. క‌రోనా సోక‌డం నేర‌మేమీ కాద‌ని, క‌రోనా సోకిన వారి ప‌ట్ల వివ‌క్ష కూడ‌ద‌న్న‌ట్టుగా సుమ‌ల‌త త‌న పోస్టులో పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం క‌రోనా పై యుద్ధం జ‌రుగుతోంద‌ని, కోవిడ్ పాజిటివ్ గా తేలిన వాళ్లు యుద్ధంలో పోరాడుతున్న వారే అని సుమ‌ల‌త పేర్కొన్నారు. క‌రోనా సోకింద‌ని సిగ్గుప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. వైద్యుల సూచ‌న‌లు పాటించి, క‌రోనా నుంచి కోలుకోవాల‌ని ఆమె సూచించారు. సుమ‌ల‌త వ‌య‌సు 56 సంవ‌త్స‌రాలు.