ఆ నటుడు బెదిరిస్తున్నాడు.. మీ టూ నటీమణి!

తను చేసిన సినిమాలను జనాలు దాదాపుగా మరిచిపోయిన స్థితిలో 'మీ టు' అంటూ అమెరికా నుంచి వచ్చి రచ్చ రేపింది తనూశ్రీ దత్తా. అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన రోజున, మారిపోయిన లుక్ తో…

తను చేసిన సినిమాలను జనాలు దాదాపుగా మరిచిపోయిన స్థితిలో 'మీ టు' అంటూ అమెరికా నుంచి వచ్చి రచ్చ రేపింది తనూశ్రీ దత్తా. అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన రోజున, మారిపోయిన లుక్ తో వార్తల్లో నిలిచిన తనుశ్రీ ఆ తర్వాత వరస ఇంటర్వ్యూలతో హీటెక్కించింది.

బాలీవుడ్ లో తను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పి దుమారం రేపింది. అంతేనా.. దేశంలోనే 'మీ టూ' ఉద్యమానికి ఊపును ఇచ్చింది. తనూ శ్రీ దత్తా సంచలన ఆరోపణల తర్వాతనే అనేక మంది నటీమణులు 'మీ టూ' అన్నారు.

అలా దుమారం రేపిన తనూశ్రీ కొంత కాలానికి తిరిగి అమెరికా వెళ్లిపోయింది. అయితే తాజాగా ఆమె మళ్లీ ఇండియాకు వచ్చింది. ఏదో చారిటీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చింది. అయితే మీడియా ఆమెతో 'మీ టూ' ప్రస్తావనే తీసుకు వచ్చింది. నానా పటేకర్ పై సంచలన ఆరోపణలు చేసిన ఈమె వద్ద ఆ విషయాన్నే ప్రస్తావించారు మీడియా ప్రతినిధులు.

దానిపై తనూ శ్రీ స్పందిస్తూ.. 'చాలా మంది సాక్షులను నానా పటేకర్ బెదిరించారు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం  చెప్పవద్దని బెదిరించారాయన..' అంటూ తనూశ్రీ వ్యాఖ్యానించింది. మరోవైపు తనూశ్రీ చేసిన ఆరోపణలపై తనకు క్లీన్ చిట్ కోరుతూ పోలీసుల వద్ద నానా పటేకర్ ఒక పిటిషన్ దాఖలు చేశారట. 

రేపోమాపో అదే జరగబోతోందని తెలుస్తోంది. తనూశ్రీ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లభించలేదని పోలీసులు తేల్చే అవకాశాలున్నాయి. ఇప్పుడు తనూశ్రీ కూడా ముందంతలా సీరియస్ గా లేకపోవడం గమనార్హం. 'ఆ నటుడు సాక్షులను బెదిరించాడు..' అంటూ ఆమె తేల్చేస్తున్నారు!