Advertisement

Advertisement


Home > Movies - Movie News

పెళ్లెప్పుడో తేల్చేసిన‌ ముద్దుగుమ్మ‌

పెళ్లెప్పుడో తేల్చేసిన‌ ముద్దుగుమ్మ‌

త‌క్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు పొందిన హీరోయిన్ల‌లో తాప్సీ ఒక‌రు. మొద‌ట టాలీవుడ్‌లో స‌త్తా చూపిన ఈ ముద్దు గుమ్మ‌, ఆ త‌ర్వాత బాలీవుడ్ అవ‌కాశాల‌ను ద‌క్కించుకున్నారు. 

తాజాగా త‌న పెళ్లి సంగ‌తుల గురించి చెప్పుకొచ్చారామె. ‘రష్మీ రాకెట్’ చిత్రీక‌ర‌ణ‌లో బీజీగా ఉన్నారామె. ఇందులో అథ్లెట్‌గా తాప్సీ న‌టిస్తున్నారు.  ఈ సినిమా కోసం డైట్ కూడా మార్చారామె.  వ్యాయామంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు.  

ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న తాప్సీ త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ప్రియుడు మ‌థియాస్ బోతో ప్రేమ‌, పెళ్లి గురించి కూడా మాట్లాడారు. తానెప్పుడూ వృత్తిగ‌త‌, వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను వేర్వేరుగా చూస్తాన‌న్నారు. 

ఆ ఆలోచ‌న‌తోనే చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తితో ప్రేమ కార్య‌క‌లాపాలు సాగించ‌లేద‌ని తాప్సీ చెప్పారు. తాను ఎంతో ముఖ్యమైన వ్య‌క్తులుగా భావించే వారి పుట్టినరోజులను పురస్కరించుకుని సోషల్‌మీడియా వేదికగా ఫొటోలు షేర్ చేస్తూ శుభాకాంక్ష‌లు చెబుతుంటాన‌న్నారు. 

అదే రీతిలో తన ప్రియుడు మథియాస్‌ బో బర్త్‌డేకు కూడా  చేస్తానని తాప్సీ వెల్ల‌డించారు. ఇక త‌న పెళ్లి ముచ్చ‌ట్ల‌ను కూడా ముద్దుగుమ్మ పంచుకున్నారు. ఇండ‌స్ట్రీలో కెరీర్‌పరంగా సాధించాల్సిన క‌ల‌లెన్నో ఉన్నాయ‌న్నారు. వాటిని నెర‌వేర్చుకోవ‌డంపైనే త‌న ఆలోచ‌న‌ల‌న్నీ ఉన్నా య‌న్నారు. 

తానెప్పుడైతే  ఆశించిన స్థాయికి చేరుకున్నాన‌ని భావిస్తానో, అప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తాన‌ని ముద్దుగుమ్మ తేల్చి చెప్ప‌డం విశేషం. ప్రస్తుతం ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తున్న‌ట్టు తాప్సీ వెల్ల‌డించారు.  

రాజకీయ కామెడీ స్టార్ గా పవన్ కళ్యాణ్

కామెడీ చెయ్యడం కామెడీ కాదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?