Advertisement

Advertisement


Home > Movies - Movie News

తెరపైకి ఆరడగుల బుల్లెట్

తెరపైకి ఆరడగుల బుల్లెట్

ఏనాడో నిర్మాణం అయిపోయి, అనేకానేక చిక్కుల్లో చిక్కుకుని ఆగిపోయిన సినిమా ఆరడగుల బుల్లెట్. గోపీచంద్ హీరో. నయన తార హీరోయిన్. ఒకప్పటి బ్లాక్ బస్టర్ డైరక్టర్ బి గోపాల్ దర్శకుడు. ఆర్ధిక వివాదాల్లో చిక్కుకున్న ఈ సినిమాను ఎలాగైనా తెరపైకి తీసుకురావాలన్న నిర్మాత రమేష్ ప్రయత్నాలు ఫలించాయి.

థియేటర్లు రీ ఓపెన్‌ కాగానే ‘ఆరడుగుల బుల్లెట్‌` చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత తాండ్ర రమేష్ ఓన్ రిలీజ్‌ చేస్తుండటం విశేషం. 

త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను స్టార్ట్‌ చేసి విడుదల తేదీ వంటి విషయాలపై పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. గోపిచంద్, న‌య‌న‌తార కాంబినేష‌న్‌, బి. గోపాల్ డైరెక్ష‌న్‌, వ‌క్కంతం వంశీ క‌థ‌, మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్లు

ఇప్పటికే గోపీచంద్ సీటీమార్ సినిమా విడుదల డేట్ ప్రకటించి కూడా కరోనా వల్ల ఆగిపోయింది. ఆ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈలోగా మధ్యలో ఈ ఆరడుగుల బుల్లెట్ దూరుతోంది. 

ఈ రెండు ఇలా వుండగానే మారుతి డైరక్షన్ లో పక్కా కమర్షియల్ సినిమా చకచకా రెడీ అవుతోంది. అంటే ఈ ఏడాది ద్వితీయార్థంలో గోపీచంద్ సినిమాలు మూడు విడుదల అవుతాయన్నమాట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?