నెటిజన్ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలో దిక్కుతోచని స్థితిలో మెగాబ్రదర్ నాగబాబును ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం దేవుడిలా ఆదుకున్నారు. సోషల్ మీడియాలో నాగబాబు ఎంత యాక్టీవ్గా ఉంటారో అందరికీ తెలుసు. నెటిజన్లు, అభిమానుల చిత్రవిచిత్రమైన ప్రశ్నలకు ఆయన ఓపిగ్గా సమాధానం ఇస్తుంటారు.
కూతురు నిహారిక పెళ్లి తర్వాత ఆయన ఎక్కువగా కుమారుడు వరుణ్ వివాహం గురించి సోషల్ మీడియాలో ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. తమకు కులమతాల పట్టింపుల్లేవని, వరుణ్ తేజ్ ఎవర్నీ పెళ్లి చేసుకున్నా అభ్యంతరం లేదంటూ నాగబాబు తన మనసులో మాట ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా వరుణ్ పెళ్లి గురించి ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్న సంధించాడు. దీనికి సమాధానం ఏం చెప్పాలో నాగబాబుకు కాసేపు దిక్కుతోచలేదు. ఆ తర్వాత సమయానికి బ్రహ్మానందం గుర్తొచ్చి, సమస్య నుంచి బయటపడ్డారు. ఆ ఫన్నీ సంఘటన గురించి తెలుసుకుందాం. ఇన్స్ట్రాగ్రామ్ లైవ్లో నాగబాబు అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘వరుణ్ అన్నా సాయి పల్లవికి మ్యారేజ్ చేస్తా సార్.. జోడీ బాగుంటుంది' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ఏకంగా ఫలానా హీరోయిన్తో అని నెటిజన్ ప్రస్తావించడంతో నాగబాబు అవాక్కయ్యారు. ఆ క్షణంలో జాతిరత్నాలు సినిమాలోని ఓ సీన్ ఆయన మనసులో మెరుపులా మెరిసింది. ఆ సినిమాలోని క్లైమాక్స్లో వచ్చే కోర్టు సీన్ వీడియోను పోస్ట్ చేసి నెటిజన్కు రీషాకిచ్చారు.
ఆ కోర్ట్ సీన్లో జడ్జ్గా ఉన్న బ్రహ్మానందం 'తీర్పు మీరు మీరు చెప్పుకోండ్రా. ఇక, నేనెందుకు? ఇక్కడి నుంచి వెళ్లిపోతాలే' అనే డైలాగ్ చెబుతారు. అభిమాని ప్రశ్నకు సమాధానం నాగబాబు వీడియోను పోస్ట్ చేయడం ఆయనలోని హాస్య చతురత ప్రతిబిం బించినట్టు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నాగబాబు ఫన్నీ రిప్లై సోషల్ మీడిమాలో వైరల్ అయింది. మొత్తానికి నాగబాబును బ్రహ్మానందం ఆదుకోకపోతే ...ఆయన పరిస్థితి ఏంటో అనే సరదా కామెంట్స్ ప్రత్యక్షమయ్యాయి.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు