ఘోరమైన పరిస్థితిలో ఉన్నామని, ఇంతకన్నా తాను ఎక్కువ మాట్లాడదలచుకోలేదని బిగ్బాస్ సీజన్-4 విన్నర్ అభిజిత్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి సృష్టించిన విలయమే ఆయనలో నిర్వేదాన్ని కలిగించిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇప్పుడు కరోనా బాధితులు కానివారెవరూ లేరు.
ప్రత్యక్షంగానో, పరోక్షంగానూ అందరూ కరోనా బాధితులే. ఈ నేపథ్యంలో బిగ్బాస్ సీజన్ -4 విన్నర్ అభిజిత్ కూడా కరోనా బాధితుడయ్యాడు. ఆయన తల్లి కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను పంచుకున్నాడు.
ఏం జరగకూడదని అనుకున్నానో అదే జరిగిందని వాపోయాడు. కుటుంబ సభ్యులందరికి నెగెటివ్ రాగా, అమ్మకు మాత్రం పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోవడం తప్ప, మరో మార్గం లేదన్నాడు. అమ్మకు సీటీ లెవల్స్ బాగుండడం కొంత ఊరటనిచ్చే విషయమన్నాడు.
త్వరలోనే తన తల్లి కోలుకుంటుందని అభిజిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. మన మానసిక ధైర్యాన్ని కరోనా పరీక్షిస్తోందన్నాడు. కరోనా బారిన పడిన వారిని ఐసోలేషన్ పేరుతో రూంలో బంధించడం దారుణమని అతను వాపోయాడు.
ఘోరమైన పరిస్థితిలో ఉన్నామని, దీని గురించి ఇంత కన్నా ఎక్కువ మట్లాడదలచుకోలేదని అభిజిత్ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా జరగకూడనదే జరిగిందని అభిజిత్ ఆవేదన వ్యక్తం చేయడంపై నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అభిజిత్ మాతృమూర్తి త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు