Advertisement

Advertisement


Home > Movies - Movie News

థర్టీ ఇయర్స్ కు ‘భరణం’ షాక్

థర్టీ ఇయర్స్ కు ‘భరణం’ షాక్

థర్టీ ఇయర్స్ పృధ్వీ కి కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నెలకు ఎనిమిది లక్షల వంతున 2017 జనవరి నుంచి ఇప్పటి వరకు తన భార్యకు భరణం చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. 

అంతే కాదు ఇకపై నెల నెలా 10 వ తేదీ లోపు నెలకు ఎనిమిది లక్షల వంతున భరణం చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. 2017 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు ఆరు కోట్లు చెల్లించాల్సి వుంటుంది.

పృధ్వీరాజ్ భార్య, విజయవాడ కు చెందిన శ్రీలక్ష్మి 2017 జనవరిలో కోర్టులో కేసు వేసారు. 2016లో తనను పృధ్వీ ఇంట్లోంచి పంపించేసారని, తల్లితండ్రులతో వుంటున్నా అని పేర్కొన్నారు. పృధ్వీ కోసం తమ తల్లితండ్రులు ఎంతో ఖర్చు చేసారని పేర్కొన్నారు.

నెలకు ముఫై లక్షల వరకు పృధ్వీ సంపాదిస్తున్నారని, తనకు తగిన భరణం ఇప్పించాలని కోర్టును కోరడంతో, పూర్వా పరాలు విచారించిన తరువాత ఈ మేరకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

తాడేపల్లిగూడెం కు చెందిన పృధ్వీ ప్రస్తుతం సినిమాల్లో, రాజకీయాల్లో ఇలా రెండు రకాలుగా బిజీగా వున్నారు. మరి ఈ కేసు మీద అపీల్ కు వెళ్తారో? భరణం, అరియర్స్ చెల్లిస్తారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?