“పిల్లాడి బ్రెయిన్ కు సంబంధించి చేయాల్సిందంతా చేశాం. ఇక చేయాల్సింది రీహాబ్ లో ఫిజియోథెరపీ మాత్రమే. అది చేస్తే నరాలు కొంచెం మెరుగుపడి బ్రెయిన్ నుంచి స్పందనలు రావొచ్చు. ఇంక వేరే ట్రీట్ మెంట్ అయితే ఏం లేదు.”
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుత పరిస్థితి ఇది. కొన్ని నెలల పాటు కిమ్స్ లో చికిత్స అందించిన తర్వాత, ఇక అతడు పూర్వస్థితికి రాడని వైద్యులు దాదాపు ఓ నిర్ణయానికి వచ్చేశారు.
రీహాబిలిటేషన్ సెంటర్ లో ఫిజియోథెరపీ చేస్తే ఏమైనా ఫలితం ఉండొచ్చనే ఒకే ఒక్క ఆశతో బాబును అక్కడికి షిఫ్ట్ చేశారు. ఇదే తమ చివరి ప్రయత్నమని, ఇకపై బాబుతో ఇలానే ఉండాల్సి వస్తుందని అంటున్నాడు శ్రీతేజ్ తండ్రి.
గతంతో పోలిస్తే ఓ 15 శాతం ఆరోగ్యం మెరుగైంది తప్ప, మంచం పైనుంచి పిల్లాడు దిగి నడిచే పరిస్థితి ఇక ఉండదని ఆ తండ్రి దాదాపు ఓ అభిప్రాయానికొచ్చేశాడు. ఈ దుర్ఘటనలో బాబు తల్లి రేవతి మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. అతడు ఒక రాత్రి జైళ్లో కూడా గడపాల్సి వచ్చింది. ప్రస్తుతం బెయిల్ పై ఉన్న బన్నీ, పిల్లాడి బాగోగులు చూసేందుకు కొంత మొత్తాన్ని ఫిక్స్ డ్ డిపాజిట్ చేశాడు. దాన్నుంచి వచ్చే నెలవారీ మొత్తంతో కుటుంబ పోషణ జరిగేలా ఏర్పాటుచేశాడు.
ఈ సినిమాకి నల్ల డబ్బు ఫండింగ్ చేసి తెల్ల డబ్బు దండుకున్న జగన్ రెడ్డి ఎందుకు సహాయం చేయలేదు ?
Ippudu Telangana state veruuuu andhra state veru erri p/k