చంద్రబాబువి.. అచ్చంగా రియల్ ఎస్టేట్ మాటలే!

అమరావతి రాజధానిని ఘనంగా నిర్మించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూనుకున్నారు. మరి కొన్ని గంటల వ్యవధిలోనే దీనికి సంబంధించి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోడీచేతుల మీదుగా.. శంకుస్థాపన జరగనుంది. అవసరమైనన్ని నిధులను ముందుగానే రుణాల రూపేణా…

అమరావతి రాజధానిని ఘనంగా నిర్మించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూనుకున్నారు. మరి కొన్ని గంటల వ్యవధిలోనే దీనికి సంబంధించి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోడీచేతుల మీదుగా.. శంకుస్థాపన జరగనుంది. అవసరమైనన్ని నిధులను ముందుగానే రుణాల రూపేణా ఒప్పందాలు చేసేసుకున్నారు.. కొంత మేర విడుదల కూడా అయ్యాయి కాబట్టి.. శరవేగంగా పనులు జరుగుతాయి. ఇదంగా బాగానే ఉంది.

అధికారంలోకి వచ్చిన వెంటనే.. ప్రణాళికా బద్ధంగా అమరావతి పనులను ఏడాదిలోగా పునఃప్రారంభిస్తున్న ప్రభుత్వాన్ని అభినందించాలి. అమరావతి రాజధానిని ప్రేమిస్తున్న వారందరికీ ఇది శుభవార్త. కానీ.. అమరావతి నిర్మాణం కారణంగా.. ఎలాంటి ప్రగతి చోటు చేసుకుంటుందో.. చంద్రబాబునాయుడు చెబుతున్న మాటలను గమనిస్తోంటే.. చాలా చిత్రంగా అనిపిస్తోంది. ఆయన అచ్చంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తిలాగానే మాట్లాడుతున్నారు తప్ప.. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిలాగా మాట్లాడడం లేదని పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబునాయుడు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 11 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించారు. ఆయన సహజంగానే ఏ ఊర్లో ఏ సభలో పాల్గొన్నప్పటికీ.. అమరావతిని కీర్తించడం మాత్రమే పనిగా పెట్టుకుంటున్నారు గనుక.. ఇక్కడ కూడా.. అమరావతి స్తోత్రాలు చేశారు. దీనిని కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎన్డీయే సర్కారు గద్దె ఎక్కిన తర్వాత.. నికరంగా చేస్తున్న ఏకైక పని అమరావతి మాత్రమే. దాన్ని గురించి కూడా వారు డప్పుకోకపోతే.. ఇంకెవరు కొడతారు. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఆయన అమరావతి గురించి ఎంతో గొప్పగా చెప్పుకోగల విషయాలన్నింటినీ విస్మరించి.. రియల్ ఎస్టేట్ మాటలు వల్లిస్తున్నారు.

అమరావతిలో రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల ధరలు ఇప్పుడు విపరీతంగా పెరిగాయని చంద్రబాబునాయుడు అంటున్నారు. అక్కడి రైతులందరినీ కోటీశ్వరులుగా మారుస్తున్నాం అని అని ఆయన చెబుతున్నారు. ఇది నిజమే కావొచ్చు గాక.. భూములిచ్చిన వారందరూ కోటీశ్వరులే కావొచ్చు గాక.. కానీ.. అమరావతి గురించి చెప్పుకోడానికి చంద్రబాబుకు అంతకంటె గొప్ప సంగతి కనిపించనే లేదా? అనేది సామాన్యుల సందేహం.

అలాగే అమరావతి రైతుల్ని మాత్రం కోటీశ్వరులుగా మారుస్తానంటున్నావే చంద్రబాబూ.. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఉన్నది మనుషులు కాదా.. వారు భూములు ఇవ్వకపోవచ్చు గాక.. కానీ వారిని కనీసం లక్షాధికారులుగానైనా మార్చే ప్రణాళికలు ఏమైనా తమరి ప్రభుత్వం వద్ద ఉన్నాయా? అనే సందేహాలు కూడా ప్రజల్లో కలుగుతున్నాయి.

10 Replies to “చంద్రబాబువి.. అచ్చంగా రియల్ ఎస్టేట్ మాటలే!”

  1. హైదరాబాద్ లో , బెంగళూరు లో రియల్ ఎస్టేట్ మాఫియా తో వ్యాపారం చేస్తున్న జగన్ రెడ్డి కి వీటితో పనేముంది ?

  2. this is a classic example of how che ddi batch build propaganda against others…Farmers gave land and in return got 1/4. As leader of govt, he is stating that govt will keep promise and farmers need not fear…

    “రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఉన్నది మనుషులు కాదా.”..so you criticized CBN for making promises to farmers and then you turn opposite and again criticize him for making farmers rich.

    Andhra does not need this che ddi batch…they are divisive, cunning characters

  3. Nv evaru swamy migatha pranthalu antav 😂

    7 mem. Devotees chanipothene online lo reviews chesi chethulu dulupukunodu , migatha pranthalu kosam alochisthada? 😂

  4. No demand in Amaravathi region which is evident from the registrations revenue within last 11 months. When content is weak, publicity will peak. Even BJP and JSP supporters are not ready to invest in Amaravati region.

  5. విసా రెడ్డి గారి అల్లుడు గారు అరబిందో రియాలిటీ వాళ్ళు కడుతున్న హై రైజ్ బిల్డింగ్స్..వారి వ్యాపారం దెబ్బ తీయాలని గత నాలుగు రోజులుగా సాక్షి లో హైరైజ్ బిల్డింగ్ లో అపార్ట్మెంట్ కొనవద్దు అంటున్న సాక్షి మీడియా..

  6. //అమరావతి రైతుల్ని మాత్రం కోటీశ్వరులుగా మారుస్తానంటున్నావే చంద్రబాబూ.. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఉన్నది మనుషులు కాదా.//

    .

    పొని రాష్త్రం మొత్తం రాజదానులు కట్టమంటవా?

    వీడు అమరావతి పనులు జరగటం లెదు అని కాసెపు ఎడుస్తావు…

    జరుగుతుంటె… ప్రాంతీయ విద్వెషాలు రెచ్చకొడుతూ ఎడుస్తావు!

    అదికాకుంటె ఇలా ఎదొ అసందర్బంగా రాసి ఎడుస్తాడు

    .

    ఎమిరా బాలరాజు… నీ వళ్ళ ఎమిరా ఈ రాష్ట్రానికి ఉపయొగం!!

Comments are closed.