త్రివిక్రమ్ కు మైత్రీకీ శాశ్వత వైరం?

దర్శకుడు త్రివిక్రమ్ కు నిర్మాణ సంస్థ మైత్రీకి శాశ్వత వైరం ఫిక్స్ అయిపోయినట్లేనా? మైత్రీ అడ్వాన్స్ ను వెనక్కు ఇచ్చే విషయంలో నెలకొన్న అభిప్రాయ బేధాలు ముదిరి పాకాన పడిపోయినట్లేనా? జ‌రుగుతున్న వ్వవహారాలు చూస్తుంటే…

దర్శకుడు త్రివిక్రమ్ కు నిర్మాణ సంస్థ మైత్రీకి శాశ్వత వైరం ఫిక్స్ అయిపోయినట్లేనా? మైత్రీ అడ్వాన్స్ ను వెనక్కు ఇచ్చే విషయంలో నెలకొన్న అభిప్రాయ బేధాలు ముదిరి పాకాన పడిపోయినట్లేనా? జ‌రుగుతున్న వ్వవహారాలు చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. 

ప్రస్తుతం త్రివిక్రమ్ హీరో మహేష్ తో ఓ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇటీవల జ‌రిగిన సంగతి తెలిసిందే.

సాధారణంగా ఇలాంటి ఫంక్షన్ కు హీరోతో సంబంధాలు వున్న ప్రతి దర్శకుడు హాజ‌రవుతారు. యూనిట్ మాత్రమే చేసుకుంటే వేరు. అందరినీ పిలిస్తే త్రివిక్రమ్ ను కూడా పిలుస్తారు. కానీ మైత్రీ మూవీ మేకర్స్ అలా పిలవలేదని తెలుస్తోంది. 

మహేష్ తో గతంలో సినిమాలు చేసిన దర్శకులు అందరికీ దాదాపుగా ఈ ఈవెంట్ కు పిలుపులు వెళ్లాయి. త్రివిక్రమ్ కు తప్ప.

మరి మహేష్ బాబుతో సినిమా వుందని తెలిసీ మైత్రీ సంస్థ పిలవలేదు అంటే వైరం ముదిరినట్లే అనుకోవాలి. మహేష్ పిలవమని చెప్పలేదు అంటే వైనం వుందని ఆయన కూడా అర్థం చేసుకుని వుండాలి. 

మొత్తం మీద ఓ టాప్ డైరక్టర్ కు, ఓ టాప్ నిర్మాణ సంస్థకు నడుమ తలుపులు పూర్తిగా మూసుకునిపోయినట్లే.