కొన్ని రోజులుగా వేద‌న‌లో ఉన్నాం: రామ్‌చ‌ర‌ణ్ స‌తీమ‌ణి

మెగాస్టార్ కోడ‌లు, యంగ్ హీరో రామ్‌చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ త‌న అభిప్రాయాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు పంచుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే మూడువారాలుగా ఆమె సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. తాజాగా…

మెగాస్టార్ కోడ‌లు, యంగ్ హీరో రామ్‌చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ త‌న అభిప్రాయాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు పంచుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే మూడువారాలుగా ఆమె సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆమె సోష‌ల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు.

గ‌త కొన్ని రోజులుగా మ‌న‌మంతా వివిధ చేదు వార్త‌ల‌తో మాన‌సికంగా కుంగిపోయామ‌ని తెలిపారు. అలాగే  త‌మ కుటుంబ స‌భ్యులు కూడా గత కొన్ని రోజులుగా వేద‌న‌లో ఉన్నార‌ని చెప్పారు. త‌మ ఆవేద‌న‌కు కార‌ణం ఏం చెప్పారో  తెలుసుకుందాం.

‘గ‌త 20 రోజుల నుంచి మ‌నం ఎన్నో భ‌రించాం. మా కుటుంబంలోని ముగ్గురు పెద్ద‌వాళ్లు క‌న్నుమూశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ మ‌ర‌ణ‌వార్త విన్నాం. కొవిడ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మ‌న దేశాన్ని కాపాడేందుకు జ‌వాన్లు త‌మ ప్రాణాల్ని త్యాగం చేశారు. వీటిని ఎదుర్కోవ‌డం అంత సుల‌భం కాదు.  వారం క్రితం మా వివాహ ఎనిమిదో వార్షికోత్స‌వం. కానీ, ఆ ప్ర‌త్యేక రోజును జ‌రుపుకొనే ఆస‌క్తి మాలో లేదు. మూడు ర‌కాల ఆవ‌కాయ ప‌చ్చ‌ళ్లు, అన్నం, చిప్స్ మాత్ర‌మే తిన్నాం, ఇంట్లోనే టీవీ చూశాం. ఈ స‌మ‌యంలోనే జీవితానికి కావాల్సిన అతి ముఖ్య‌మైన పాఠాల్ని నేర్చుకున్నాం’’ అని ఉపాస‌న పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఉపాస‌న  ఫొటోను షేర్ చేశారు.  ఫొటోలో సింహం, గుర్రం బొమ్మ‌లు, ఆవ‌కాయ‌తో క‌లిపిన అన్నం, చిప్ప్, ఫోన్‌, టీవీ రిమోట్‌ ఉన్నాయి. ఈ ఫొటో వెనుక నేప‌థ్యాన్ని కూడా ఆమె వివ‌రించారు. ఫొటోలోని ఒక్కో వ‌స్తువు త‌మ‌లోని కొత్త విష‌యాన్ని తెలుపుతుంద‌న్నారు.

రెండో భార్యతో తిరుమలకు దిల్ రాజు