భైరవ ద్వీపం నటుడు విజయ రంగరాజు అకాల మృతి!

టాలీవుడ్ సీనియ‌ర్ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు.

టాలీవుడ్ సీనియ‌ర్ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. వారం క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా షూటింగ్‌లో విజయ రంగరాజు గాయపడినట్లు సమాచారం. అనంతరం చికిత్స కోసం చెన్నైకి తరలించిన ఇవాళ తుదిశ్వాస విడిచారు.

1994లో వచ్చిన భైరవ ద్వీపం చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. ఎక్కువగా విలన్, సహాయ పాత్రల్లో నటించారు. యజ్ఞం చిత్రంతో మంచి గుర్తింపు పొందారు. ఇందులో గోపీచంద్ హీరోగా నటించగా, విజయ రంగరాజు విలన్ పాత్ర పోషించారు. ఆయన తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా న‌టించి మంచి పేరు సంపాధించుకున్నారు. దాదాపు సౌత్‌లోని సీనియ‌ర్ న‌టులు అంద‌రితోను న‌టించారు.

గ‌తంలో క‌న్న‌డ దిగ్గ‌జ న‌టుడు విష్ణువ‌ర్ధ‌న్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంతో వివాదంలో చిక్కుకున్నారు. అనంత‌రం విష్ణువ‌ర్ధ‌న్ అభిమానుల‌కు క్షమాపణలు చెప్పారు.

విజయ రంగరాజు సినిమాలో న‌టించ‌డమే కాకుండా వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్‌లో కూడా చురుకుగా పాల్గొన్నారు. విజయ రంగరాజుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విజయ రంగరాజు మరణం తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దెబ్బగా మిగిలింది.

3 Replies to “భైరవ ద్వీపం నటుడు విజయ రంగరాజు అకాల మృతి!”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. Ga బాబూ, నీకు తెలియకపోతే తెలియనట్టు ఉండు….. 80వ దశకంలో వచ్చిన చిరంజీవి జ్వాల సినిమా, రాజేంద్ర ప్రసాద్ తోడల్లుళ్ళు, వగైరా సినిమాల్లో ఉన్నాడు….. నువ్వేమో 1994 లో భైరవద్వీపం సినిమాతో ఎంట్రీ అంటున్నావు🤦♂

Comments are closed.