వినరో భాగ్యము..ఫస్ట్ సింగిల్

గీతా కాంపౌండ్ నుంచి వస్తున్న మరో సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ కిరణ్ అబ్బవరం కథానాయకుడు. తిరుపతి నేపథ్యంలో జరిగే కథతో తొలిసారి మురళీ కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా…

గీతా కాంపౌండ్ నుంచి వస్తున్న మరో సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ కిరణ్ అబ్బవరం కథానాయకుడు. తిరుపతి నేపథ్యంలో జరిగే కథతో తొలిసారి మురళీ కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా నుండి మొదటి సింగిల్ సాంగ్ ను దర్శకుడు కె విశ్వనాథ్ చేత రిలీజ్ చేయించింది చిత్రబృందం. “వాసవసుహాస” అనే పాటను పాటను రిలీజ్ చేస్తూ “నాకు నా పాత రోజులు గుర్తొస్తున్నాయి, ఎలా ఒప్పుకున్నారా ప్రొడ్యూసర్స్ అనిపిస్తుంది అంటూ ఇటువంటి పాటను అంటూ ప్రశంసించారు విశ్వనాధ్. ఈ పాటను కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని రచించారు.

యుగ యుగాలుగా ప్రభోదమై పది విధాలుగా పదే పదే. పలికేటి సాయ జాడలే కదా నువ్వెదికే నదిదైనా…అంటూ సాగుతుందీ గీతం.

పక్కవాడికి సాయం చెయ్యమని చెప్పటానికి ఎత్తిన పది అవతారాలు ఆదర్శమే కదా నీది, అదే కదా నువ్వెళ్ళే దారి అలాంటి నీ దారిలో నవ్వులు పూయకుండా ఎలా ఉంటాయి. ఇప్పటి ఆలోచన నిన్నటి నీ అనుభవం నుండి వచ్చిందే కదా. అంటూ సారాంశాన్ని కూడా ఈ పాటలో జోడించడం విశేషం. ఈ పాటను కారుణ్య ఆలపించారు. ఈ సినిమాకి చైత‌న్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ నిర్మాత బాబు..నిర్మాత బన్నీవాస్. ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది.