తగ్గేదేలే అంటున్న వినాయక్.. మరోసారి ముఖానికి రంగు

వినాయక్ హీరోగా చేయాల్సిన సినిమా శీనయ్య. దిల్ రాజు బ్యానర్ పై రావాల్సిన ఈ సినిమా ఆగిపోయిందనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో వినాయక్ కూడా నటించాలనే తన కోరికను చంపేసుకున్నాడని అంతా అనుకున్నారు.…

వినాయక్ హీరోగా చేయాల్సిన సినిమా శీనయ్య. దిల్ రాజు బ్యానర్ పై రావాల్సిన ఈ సినిమా ఆగిపోయిందనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో వినాయక్ కూడా నటించాలనే తన కోరికను చంపేసుకున్నాడని అంతా అనుకున్నారు. కానీ వినాయక్ మాత్రం ఈ విషయంలో తగ్గేదేలే అంటున్నాడు. శీనయ్య ఆగిపోయినా, మరో ప్రాజెక్టుతో త్వరలోనే తెరపైకొస్తానంటున్నాడు వినాయక్.

“15 నిమిషాల కథగా చెప్పినప్పుడు శీనయ్య బాగుంది. కానీ దాన్ని రెండున్నర గంటల సినిమాగా మార్చినప్పుడు ఎవ్వరికీ నచ్చలేదు. దీంతో ఆ ప్రాజెక్టును ఆపేశాం. భవిష్యత్తులో శీనయ్య వచ్చే అవకాశం లేదు. కానీ మరో రూపంలో నేను తెరపైకొస్తాను. మంచి ప్రాజెక్టు దొరికితే నటించడానికి సిద్ధం”

ఇలా నటించే ఆసక్తిని బయటపెట్టాడు వినాయక్. శీనయ్య సినిమా ప్రాసెస్ ను బాగా ఎంజాయ్ చేశానని, ఎలాంటి టెన్షన్ లేకుండా చక్కగా ఆ టైమ్ గడిచిపోయిందన్న వినాయక్.. రాబోయే రోజుల్లో మరో కథతో తెరపైకొచ్చే ఆలోచన ఉందని స్పష్టంచేశాడు. మరోవైపు తన దర్శకత్వంలో రాబోతున్న సినిమాపై కూడా స్పందించాడు.

“ప్రస్తుతం ఓ స్టోరీపై వర్క్ జరుగుతోంది. అది ఎలాంటి షేప్ తీసుకుంటుందో తెలీదు. బాగా కుదిరితే కచ్చితంగా డైరక్ట్ చేస్తాను. బాలకృష్ణకు నేనంటే ఇష్టం. అలాగే చిరంజీవి, ఎన్టీఆర్ కు కూడా నేనంటే ఇష్టం. అలా అని వాళ్లతో మల్టీస్టారర్ తీయలేను. మంచి కథ సెట్ అయినప్పుడే కాంబినేషన్ సెట్ అవుతుంది.”

మొత్మమ్మీద తన మనసులో యాక్టింగ్ ప్లాన్స్ ఉన్నాయనే విషయాన్ని వినాయక్ బయటపెట్టాడు. టాలీవుడ్ లో అందరివాడు అనిపించుకున్న ఈ దర్శకుడు.. ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారంపై స్పందించడానికి నిరాకరించాడు. ఈ అంశంపై చిరంజీవి ఎవ్వర్నీ స్పందించొద్దని అన్నారని, కాబట్టి టికెట్ రేట్లపై తను స్పందించనని చెప్పారు.