ప్రదీప్, కృష్ణుడు పేర్లు కావాలనే పెట్టాం

139 మంది తనను రేప్ చేశారని, అందులో యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు కూడా ఉన్నారంటూ సంచలన ఆరోపన చేసిన నల్గొండ అమ్మాయి కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసుకు ప్రదీప్-కృష్ణుడితో ఎలాంటి…

139 మంది తనను రేప్ చేశారని, అందులో యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు కూడా ఉన్నారంటూ సంచలన ఆరోపన చేసిన నల్గొండ అమ్మాయి కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసుకు ప్రదీప్-కృష్ణుడితో ఎలాంటి సంబంధం లేదని ఆ అమ్మాయి కొద్దిసేపటి కిందట ప్రకటించింది.

ఈ మేరకు ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. ఇదంతా కేవలం డాలర్ బాయ్ అలియాస్ రాజశేఖర్ రెడ్డి చేసిన కుట్రగా చెప్పుకొచ్చింది ఈ మహిళ. సెలబ్రిటీల్ని బ్లాక్ మెయిల్ చేయాలని కుట్ర పన్నిన డాలర్ బాయ్.. తనను చిత్రహింసలు పెట్టి వాళ్ల పేర్లు రాయించాడని, ఈ కేసుకు వాళ్లకు సంబంధం లేదని అమ్మాయి ప్రకటించిందది.

“లిస్ట్ లో చాలామంది నన్ను రేప్ చేయలేదు. నా వల్ల వాళ్లకు అన్యాయం జరుగుతుందని డాలర్ బాయ్ తో గొడవపడ్డాను. దానికి అతడు నన్ను చచ్చేంత వరకు కొట్టాడు. ఆ పెయిన్ తోనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లయింట్ ఇచ్చాను. రేప్ చేసిన వ్యక్తుల వల్ల 50శాతం నరకం అనుభవిస్తే, ఇతడి వల్ల మరో 50శాతం నరకం చూశాను. 139 మంది మాత్రం రేప్ చేయలేదు. 44 మంది మాత్రం నన్ను రేప్ చేశారు. కొంతమంది మానసికంగా హింసించారు. మొత్తం లిస్ట్ ను 3 భాగాలుగా డివైడ్ చేశాం. బలవంతంగా నన్ను కొట్టి ప్రదీప్, కృష్ణుడు పేర్లను చేర్పించారు. వాళ్లకు నేను సారీ చెబుతున్నాను.”

కేవలం డాలర్ బాయ్ ఒత్తిడి మేరకు తను ఇదంతా చేయాల్సి వచ్చిందని అంగీకరించిన మహిళ.. తన కుటుంబాన్ని చంపేస్తానంటూ అతడు బెదిరించడం వల్లనే కొంతమంది పేర్లు లిస్ట్ లో చేర్చాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. తన ఫొటోలు, వీడియోల్ని వైరల్ చేయొద్దని అందర్నీ రిక్వెస్ట్ చేసింది.

అమ్మాయి ప్రెస్ మీట్ తో ఈ కేసుపై పూర్తి స్పష్టత వచ్చింది. డాలర్ బాయ్ దొరికితే ఈ కేసుపై మరిన్ని వివరాలు బయటకొస్తాయి. మొత్తమ్మీద సదరు అమ్మాయి ప్రకటనతో ప్రదీప్, కృష్ణుడుతో పాటు చాలామంది సినీ-రాజకీయ ప్రముఖులు ఊపిరిపీల్చుకున్నారు.

V కథను పవన్-మహేష్ ను దృష్టిలో పెట్టుకొని రాయలేదు