రకుల్ పెళ్లి గోవాలోనే ఎందుకు..?

రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీ ముందుగా విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మిడిల్ ఈస్ట్ లో ఓ దేశాన్ని కూడా ఎంచుకున్నారు. అంతా ఓకే అనుకున్న టైమ్ లో ప్రధాని మోదీ పిలుపునివ్వడం, వాళ్లు తమ…

రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీ ముందుగా విదేశాల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మిడిల్ ఈస్ట్ లో ఓ దేశాన్ని కూడా ఎంచుకున్నారు. అంతా ఓకే అనుకున్న టైమ్ లో ప్రధాని మోదీ పిలుపునివ్వడం, వాళ్లు తమ వివాహ వేదికను ఇండియాకు మార్చుకోవడం చకచకా జరిగిపోయాయి.

గోవాలో రకుల్-జాకీ పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే గోవానే ఎందుకనేది ఇప్పుడు ప్రశ్న. ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటే, చాలామంది హీరోయిన్లలా జైపూర్ లేదా ఉదయ్ పూర్ లో చేసుకోవచ్చు. లేదంటే ఢిల్లీలో చాలా ప్రాంతాలున్నాయి. కానీ ఈ జంట, గోవాను ఎంచుకోవడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది.

రకుల్-జాకీల ప్రేమ గోవాలోనే చిగురించిందట. ఆ తర్వాత సమయం దొరికినప్పుడల్లా వీళ్లు గోవాలోనే ఎక్కువ ప్రేమించుకున్నారట. అందుకే సెంటిమెంట్ ప్రకారం, పెళ్లి కూడా గోవాలనే చేసుకోవాలని డిసైడ్ అయ్యారట.

చాలామంది సెలబ్రిటీ జంటల్లా వీళ్లు కూడా పెళ్లి తర్వాత హనీమూన్ కు వెళ్లడం లేదు. నిర్మాతగా తన చేతిలో ఉన్న ప్రాజెక్టు పూర్తిచేశాడు జాకీ. కానీ రకుల్ చేతిలో మాత్రం 3 సినిమాలున్నాయి. వాటిలో 2 సినిమాలకు ఆమె ప్రచారం చేయాల్సి ఉంది. అందుకే పెళ్లి తర్వాత తమతమ పనుల్లో బిజీ కాబోతున్నారు ఈ జంట. ఈ నెల్లోనే రకుల్-జాకీ పెళ్లి చేసుకోబోతున్నారు.