Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఈ పుకారుపై సమంత స్పందిస్తుందా?

ఈ పుకారుపై సమంత స్పందిస్తుందా?

ఈ ముద్దుగుమ్మ ఏదీ మనసులో దాచుకునే రకం కాదు. ఏదైనా చెప్పాల్సి వచ్చినా, స్పష్టత ఇవ్వాల్సిన సందర్భం ఎదురైనా వెంటనే మొబైల్ ఫోన్ అందుకుంటుంది. ట్విట్టర్ లో దానిపై క్లారిటీ ఇస్తుంది. కానీ ఈసారి మాత్రం సమంత సైలెంట్ అయింది. ఎందుకంటే ఆమెపై వచ్చిన పుకార్లు అలాంటివి.

అవును.. సమంతకు కరోనా సోకిందట. దీనికి కూడా ఓ కారణం ఉంది. కొన్ని రోజుల కిందట తన బెస్ట్ ఫ్రెండ్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డితో క్లోజ్ గా ఓ ఫొటో దిగింది సమంత. ఆ వెంటనే తనకు కరోనా సోకిందని శిల్పారెడ్డి స్వయంగా ప్రకటించింది. దీంతో సమంతపై కూడా చాలామంది అనుమానాలు వ్యకంచేశారు.

మరికొంతమంది మరో అడుగు ముందుకేసి సమంత-నాగచైతన్య కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత రోజు సమంత, నాగచైతన్యకు కరోనా నెగెటివ్ వచ్చిందని, వాళ్లు సేఫ్ గానే ఉన్నారంటూ మరో ప్రచారం. ఇలా సమంతకు సంబంధించి సోషల్ మీడియాలో చాలా తతంగం నడుస్తోంది.

తనకు సంబంధించిన వ్యవహారాలపై ఎప్పటికప్పుడు స్పందించే సమంత, ఈసారి మాత్రం ఎందుకో సైలెంట్ అయింది. ఇప్పటివరకు సమంత-నాగచైతన్య చుట్టూ వచ్చినవన్నీ గాసిప్స్ మాత్రమే. ఆమె శిల్పారెడ్డితో ఫొటో దిగిందనేది మాత్రమే నిజం. జరగాల్సిన ప్రచారం మొత్తం జరిగిపోయింది. ఇప్పుడు స్పందించాల్సింది సమంత మాత్రమే.

నాయకుడంటే అర్థం తెలిసింది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?