శాకుంతలం షో కాన్సిల్.. క్లారిటీ ఇచ్చిన డైరక్టర్

కంటెంట్ పై నమ్మకంతో 4 రోజుల ముందు నుంచే స్పెషల్ ప్రీమియర్స్ వేస్తున్నారు శాకుంతలం టీమ్. అయితే సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో స్పెషల్ ప్రీమియర్స్ కాన్సెప్ట్ నుంచి తప్పుకున్నట్టు వార్తలు…

కంటెంట్ పై నమ్మకంతో 4 రోజుల ముందు నుంచే స్పెషల్ ప్రీమియర్స్ వేస్తున్నారు శాకుంతలం టీమ్. అయితే సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో స్పెషల్ ప్రీమియర్స్ కాన్సెప్ట్ నుంచి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. వాటికి మరింత బలం చేకురుస్తూ ఈరోజు జరగాల్సిన మీడియా ప్రీమియర్ కూడా రద్దయింది.

దీంతో శాకుంతలం యూనిట్ వెనక్కు తగ్గిందని, ప్రీమియర్స్ రద్దు చేసిందని కథనాలు మొదలయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంపై దర్శకుడు గుణశేఖర్ క్లారిటీ ఇచ్చాడు. ప్రీమియర్స్ నుంచి తాము వెనక్కు తగ్గలేదని స్పష్టం చేసిన గుణశేఖర్, సాంకేతిక సమస్యల వల్లనే ఈరోజు వేయాల్సిన షోను రద్దు చేసినట్టు తెలిపారు.

10వ తేదీన కొంతమంది ప్రేక్షకులు, మీడియా వ్యక్తులతో కలిసి సినిమా చూశారు గుణశేఖర్. త్రీడీ వెర్షన్ లో శాకుంతలం పూర్తి సినిమా చూడడం గుణశేఖర్ కు కూడా అదే తొలిసారి. దీంతో కొన్ని సాంకేతిక సమస్యల్ని ఆయన గుర్తించారట. వాటిని సరిదిద్దడానికి కొంత సమయం పట్టిందంటున్నారు. అందుకే ఇవాళ్టి షో రద్దయిందని, రేపు కచ్చితంగా మీడియాకు సినిమాను చూపిస్తామని అంటున్నారు గుణ.

మరోవైపు హైదరాబాద్ లో షో రద్దయినప్పటికీ, ఢిల్లీలో మాత్రం శాకుంతలం సినిమా ఉందని, దిల్ రాజు ఆ వ్యవహారాలు చూసుకుంటున్నారని స్పష్టంచేశాడు దర్శకుడు.

మరోసారి సమంతకు అనారోగ్యం

సరిగ్గా సినిమా విడుదలకు 2 రోజుల ముందు సమంత మరోసారి అనారోగ్యానికి గురైంది. కొన్ని రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితి బాగా లేదనే విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ శక్తి కూడదీసుకొని ఆమె ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. ఇందులో భాగంగా ఎల్బీ స్టేడియంకు కూడా వచ్చింది. వేలాది మంది మధ్య ప్రచారం కావడంతో అప్పుడే ఆమెకు కాస్త నలత చేసిందట. ఆ తర్వాత మీడియా ఇంటరాక్షన్ లో మరింత వీక్ అయిందట. ప్రస్తుతం దగ్గు, జ్వరంతో బాధపడుతూ, ఇంటికే పరిమితమైందట సమంత.