భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 38 మంది మావోయిస్టుల మృతి

గ‌గ‌న‌త‌లంలో హెలికాప్ట‌ర్లు, డ్రోన్ల‌తో మావోయిస్టుల గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

భార‌త్‌ను మావోయిస్టు ర‌హిత దేశంగా తీర్చిదిద్దుతామ‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్ర‌క‌టించిన రోజుల వ్య‌వ‌ధిలోనే …భారీ ఎన్‌కౌంట‌ర్ చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణ – ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దు క‌ర్రెగుట్ట‌ల్లో మావోయిస్టుల ఏరివేత‌కు భ‌ద్ర‌తా ద‌ళాలు సాంకేతిక ప‌రిజ్ఞానంతో ఐదు రోజుల క్రితం ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. ఇందులో భాగంగా 38 మంది మావోయిస్టులు ఎన్‌కౌంట‌ర్ అయ్యారు. దీంతో మావోయిస్టుల‌కు కోలుకోలేని దెబ్బ త‌గిలింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్ర‌భావం దాదాపు శూన్యం. అయితే తెలంగాణ నుంచి చాలా మంది మావోయిస్టు ఉద్య‌మానికి ఆక‌ర్షితులై వెళ్లిన వాళ్లున్నారు. కొంద‌రు మృత్యువును కౌగ‌లించుకోగా, మ‌రికొంద‌రు జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిసిపోయారు. మ‌రికొంద‌రు మాత్రం తెలంగాణ స‌మీపంలోని ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రానికి వెళ్లిపోయారు.

ఆ రాష్ట్రంలో ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతాలు వుండ‌డంతో భ‌ద్ర‌త వుంటుంద‌నే ఉద్దేశంతో అక్క‌డికి వెళ్లారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర‌హోంశాఖ ఛ‌త్తీస్‌గ‌ఢ్‌పై ప్ర‌త్యేక దృష్టి సారించింది. ఎలాగైనా మావోయిస్టుల‌ను ఏరివేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో మోదీ స‌ర్కార్ వుంది. ఈ క్ర‌మంలో గ‌త ఐదు రోజులుగా క‌ర్రెగుట్ట‌ల్లో భ‌ద్ర‌తా ద‌ళాలు కూంబింగ్ చేప‌ట్టారు.

గ‌గ‌న‌త‌లంలో హెలికాప్ట‌ర్లు, డ్రోన్ల‌తో మావోయిస్టుల గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. మ‌రోవైపు మావోయిస్టుల వైపు నుంచి గాలింపు చ‌ర్య‌లు ఆపాల‌ని, శాంతిచ‌ర్చ‌ల‌కు రావాలంటూ డిమాండ్‌. దీన్ని కేంద్ర ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. మావోయిస్టుల ఆన‌వాళ్ల‌ను ప‌సిగ‌ట్టిన భ‌ద్ర‌తా ద‌ళాలు కాల్పుల‌కు దిగాయి. ఈ కాల్పుల్లో 38 మంది చ‌నిపోయిన‌ట్టు కేంద్ర హోంశాఖ వ‌ర్గాలు చెబుతున్నాయి.

3 Replies to “భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 38 మంది మావోయిస్టుల మృతి”

  1. అసలైన నక్సల్ ఎప్పుడో పోయారు. ఇప్పుడు నక్సల్స్ అనేవాళ్ళు వ్యాపారులను  భయపెట్టి నెలవారిదశం భాగాలు వాసులు చేసే వాటికన్ బిడ్డలు.

Comments are closed.