భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏ క్షణానైనా యుద్ధం కమ్ముకొస్తుందని పాకిస్థాన్ భయపడుతోంది. ఇప్పటికే సైనికులకు శెలవులు రద్దు చేసింది. ఇటు భారత్ కూడా 1971 తర్వాత తొలిసారి సివిల్ డిఫెన్స్ డ్రిల్ కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో, ఐదేళ్ల కిందటి ఓ పరిశోధనాత్మక కథనం వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటది?
బ్రిటన్ కు చెందిన రాట్ లెడ్జ్ అనే సంస్థ 2019లో ఓ పరిశోధన పత్రాన్ని విడుదల చేసింది. 2025లో భారత్-పాక్ మధ్య యుద్ధం వస్తుందని ఆ నివేదిక చెబుతోంది. అంతేకాదు, ఎలా యుద్ధం వస్తుంది, ముందుగా ఏ దేశం రియాక్ట్ అవుతుంది లాంటి అంశాలు కూడా అందులో సవివరంగా ఉన్నాయి.
రాట్ లెడ్జ్ పరిశోధనా పత్రాల ప్రకారం, యుద్ధానికి ముందు భారత్ భూభాగంలో పెద్ద ఉగ్రదాడి జరుగుతుందని ఈ పత్రాల్లో ఉంది. చెప్పినట్టుగానే పెహల్గాం దాడి జరిగింది. ఒక వేళ యుద్ధం వస్తే ముందుగా పాకిస్థాన్ అణుబాంబు వేస్తుందని కూడా ఆ పత్రాల్లో ఉంది.
భారత్-పాక్ మధ్య ఇప్పటికే కొన్ని యుద్ధాలు జరిగాయి. సరిహద్దులో ప్రచ్ఛన్న యుద్ధం దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. ప్రతిసారి పాక్ కు పరాభవం ఎదురవుతూనే ఉంది. అందుకే ఈసారి పాకిస్థాన్ చావుకు తెగించి అణుయుద్ధం మొదలుపెట్టే అవకాశం ఉందని రాట్ లెడ్జ్ పరిశోధన పత్రాల్లో ఉంది.
ముందుగా భారత్ యుద్ధ ట్యాంకుల్ని లక్ష్యంగా చేసుకొని, సరిహద్దులో అణుదాడికి దిగుతుందంట పాకిస్థాన్. ఆ తర్వాత భారత్ ప్రతిచర్య ఆధారంగా, పలు నగరాలపై దాడులు చేస్తుందంట. ఈ మేరకు ఇండియాలోని కీలకమైన 30 ప్రాంతాల్ని పాకిస్థాన్ టార్గెట్ చేసినట్టు పత్రాల్లో ఉంది.
అటు భారత్ కూడా పాకిస్థాన్ లోని 10 కీలక ప్రాంతాల్ని మట్టిలో కలిపేస్తుందని అందులో ఉంది. ఐదేళ్ల కిందట వచ్చిన ఈ పరిశోధనాత్మక కథనం ప్రస్తుతం వైరల్ అవుతోంది.
bochulo kathanam. adhi jaridedhi ledhu chachedi ledu.