ముఖానికి రంగు వేయను.. ప్యాకేజి కోసం డాన్స్ చేయను!

రాజ‌కీయ నేత‌లు ర‌క‌ర‌కాలుగా విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం కామ‌న్. ఒక‌రు రాజ‌కీయంగా ఎదుగుతుంటే వారిని చూసి ఈర్శ ప‌డ‌టం కామన్ గా జ‌రిగేది. కానీ ఈ మ‌ధ్య కాలంలో అవి హ‌ద్దులు దాటుతున్నాయి. అందులో ముఖ్యంగా…

రాజ‌కీయ నేత‌లు ర‌క‌ర‌కాలుగా విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం కామ‌న్. ఒక‌రు రాజ‌కీయంగా ఎదుగుతుంటే వారిని చూసి ఈర్శ ప‌డ‌టం కామన్ గా జ‌రిగేది. కానీ ఈ మ‌ధ్య కాలంలో అవి హ‌ద్దులు దాటుతున్నాయి. అందులో ముఖ్యంగా ప‌క్క పార్టీలో త‌న సామాజిక వ‌ర్గం నేత‌ల ఎదుగుద‌ల చూసి క‌డుప మంట వెళ్లగక్కే జ‌న‌సేన ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న అన్న నాగబాబు ముందు వ‌రుస‌లో ఉంటారు. త‌ము ఎన్నిక‌ల్లో నిల‌బ‌డిన ఎందుకు ఓట‌మి చెందారో తెలుసుకోకుండా నిత్యం ప‌క్క‌పార్టీపై విమ‌ర్శ‌లు చేస్తు కాలం గడుపుతున్నారు.

తాజాగా మంత్రి అంబ‌టి రాంబాబు సంక్రాంత్రి సంబ‌రాలు సంద‌ర్భంగా సత్తెనపల్లిలో స్థానికులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొని.. బంజారా స్టెప్పులతో అదరగొట్టారు. అస‌లే అంబ‌టి అంటే గిట్ట‌ని జ‌న‌సేన నేత‌లు అంబ‌టి డ్యాన్స్ ను చూసి ఓర్చుకోలేక‌పోతున్నారు. దీనిపై నాగ బాబు అంబ‌టిపై ట్వీట్ట‌ర్ త‌న అక్క‌సును వెళ్లగక్కారు. 

నాగ‌బాబు ట్వీట్ట‌ర్ లో అంబ‌టిని ఉద్దేశిస్తూ… 'సంబరాల రాంబాబు గారు మీరు డ్యాన్స్ మహత్తరంగా చేసారు… పోలవరం పూర్తి చేసి డ్యాన్స్ చేసి వుంటే ఇంకా మహత్తరంగా వుండేది!' అంటూ సెటైర్ వేశారు. దీనికి అదే రీతిలో మంత్రి అంబ‌టి కౌంట‌ర్ ట్వీట్ చేశారు. 'నువ్వు, మీతమ్ముడు అన్నట్టు..  “సంబరాల రాంబాబు”నే !, కానీ…ముఖానికి రంగు వేయను, ప్యాకేజి కోసం డాన్స్ చేయను!' అంటూ ఎద్దేవా చేశారు.

గ‌త వారం పొలిటిక‌ల్ టూర్ లో భాగంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ మంత్రి అంబ‌టి రాంబాబును సంబ‌రాల రాంబాబు అంటూ ఎద్దేవా చేయడంతో అదే రీతిలో అంబ‌టి' పీకే' అంటే 'పిచ్చి కుక్క' అంటూ కౌంట‌ర్ చేశారు.