ప‌వ‌న్ ‘రెండు చెప్పులు’ వెతుక్కుని పోతాడులే!

ఉదయం అంతా ఏసీ గదుల్లో కూర్చుని రాజకీయ సమావేశాలు పెడుతూ చీకటి పడే టైం చూసుకోని బహిరంగ సభ పెట్టి.. తాను ఎంతో ఇష్టపడి తయారు చేసుకున్న బస్సును స్టేజ్ గా చేసుకొని తంతాం..…

ఉదయం అంతా ఏసీ గదుల్లో కూర్చుని రాజకీయ సమావేశాలు పెడుతూ చీకటి పడే టైం చూసుకోని బహిరంగ సభ పెట్టి.. తాను ఎంతో ఇష్టపడి తయారు చేసుకున్న బస్సును స్టేజ్ గా చేసుకొని తంతాం.. పాతరేస్తామంటూ అంటూ వైసీపీ నేతలపై ముఖ్యంగా ఆ పార్టీలోని కాపు నేతలను టార్గెట్‌గా మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ట‌ర్ వేదిక‌గా సెటైర్ వేశారు.

చెప్పులు పోయాయంట.. నాలుగు రోజులు వెతుక్కుని.. తిరిగి షూటింగ్ కి పోతాడులే.. ప‌వ‌న్‌ను ప‌ట్టించుకోకండి! అంటూ ట్వీట్ చేశారు.  రాజ‌కీయాల్లో కూడా సినిమాల్లో లాగా డైలాగ్‌లు చెప్పితే ప‌ని అవుతుంద‌ని ఊహించుకోని గ‌త ఎన్నిక‌ల్లో రెండు చోట్ల ఓడిపోయిన ప‌వ‌న్‌లో మార్పు రాలేదు. వారాహి యాత్ర అనే పేరుతో వైసీపీ నాయ‌కుల‌ను తిడితే వారు సైలెంట్‌గా ఉంటారా… ప‌వ‌న్ ఒక‌టి అంటే వారు నాలుగు అంటారు. తీరా న‌న్ను అంద‌రు క‌లిసి ఓడించారు అంటూ బాధ‌ప‌డుతారు. 

కాగా పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ ఇటీవల మాజీ మంత్రి పేర్నినాని రెండు చెప్పులు చూపిస్తూ చేసిన వాఖ్యలను ఉద్దేశించి.. నిన్న రాత్రి ప‌వ‌న్ బ‌హిరంగ‌స‌భ‌లో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఎంతలా దిగజారిపోయిందంటే అన్నవనం సత్యనారాయణస్వామి గుడిలో నేను వదిలిన చెప్పులు కూడా పట్టుకుని వెళ్లిపోతుందని ఆరోపించారు. నాకు ఇష్టమైన నా రెండు చెప్పులు ఎవరో దొంగిలించారు.. మీకు కనిపిస్తే పట్టుకోండి.. నా చెప్పులు నాకు ఇప్పించండి ప్లీజ్.. అంటూ వెక్కిలి న‌వ్వులు న‌వ్వారు.

తాజాగా అంబ‌టి ట్వీట్‌తోనే స‌రిపెట్టారు. ఇన్‌డెరెక్ట్‌గా పేర్నినానిపై ప‌వ‌న్ చేసిన కామెంట్స్‌పై ఆయ‌న ఏలా స్పందిస్తార‌నేది చూడాలి. ఎందుకంటే ప‌వ‌న్ ఎవ‌రో సినిమా వారు రాసిన స్క్రీప్ట్‌ను చ‌దివి ప‌క్క‌వారిని విమ‌ర్శిస్తారు.. కానీ పేర్నినాని పేప‌ర్ లేకుండా ప్ర‌తి విమ‌ర్శ‌కు స‌మాధానం స్వ‌యంగా చెబుతార‌నేది తెలిసిందే.