వ‌ద్ద‌న్నా…విన‌ని ఏపీ స‌ర్కార్!

కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు కార్యాల‌యాన్ని విశాఖ‌కు త‌ర‌లించొద్ద‌నే డిమాండ్లు వ‌స్తున్నా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు. హైద‌రాబాద్ నుంచి విశాఖ‌కు త‌ర‌లించేందుకు ప్ర‌భుత్వం వేగంగా పావులు క‌దుపుతోంది.  Advertisement కృష్ణా బేసిన్‌తో ఏ…

కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు కార్యాల‌యాన్ని విశాఖ‌కు త‌ర‌లించొద్ద‌నే డిమాండ్లు వ‌స్తున్నా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు. హైద‌రాబాద్ నుంచి విశాఖ‌కు త‌ర‌లించేందుకు ప్ర‌భుత్వం వేగంగా పావులు క‌దుపుతోంది. 

కృష్ణా బేసిన్‌తో ఏ మాత్రం సంబంధం లేని విశాఖ‌కు కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు కార్యాల‌యాన్ని త‌ర‌లించేందుకు వ‌చ్చే నెల‌లో కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఈ మేర‌కు జ‌న‌వ‌రి 11న జ‌రిగే బోర్డు స‌మావేశంలో కార్యాల‌య త‌ర‌లింపున‌కు సంబంధించి అజెండాగా చేర్చ‌డం గ‌మ‌నార్హం.

కృష్ణా యాజ‌మాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖ‌కు త‌ర‌లించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ప‌చ్చ జెండా ఊపింది. అయితే ఆ కార్యాల‌యాన్ని గ‌తంలో విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసేందుకు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అధికారం మారిన నేప‌థ్యంలో ప‌రిపాల‌న రాజ‌ధానిగా ఎంచుకున్న విశాఖ‌లో ఏర్పాటు చేసేందుకు ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ముందుకొచ్చింది. అయితే ఆ కార్యాల‌యాన్ని కృష్ణా న‌ది ప్ర‌వ‌హించే రాయ‌ల‌సీమ‌లో ఏర్పాటు చేయాల‌నే డిమాండ్లు ఆ ప్రాంత ప్ర‌జాసంఘాలు, ఉద్య‌మకారుల నుంచి వ‌స్తున్నాయి.

విశాఖ‌కు త‌ర‌లింపు ఏ మాత్రం మంచిది కాద‌ని వారంతా అంటున్నారు. ఈ అభిప్రాయాల్ని ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. క‌నీస హ‌క్కుగా ఉన్న దాన్ని విశాఖ‌కు త‌ర‌లించ‌డం ఏంట‌నే నిల‌దీత‌లు ఆ ప్రాంతం నుంచి వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో విశాఖ‌కు త‌ర‌లించాల‌నే ప‌ట్టుద‌ల ప్ర‌భుత్వానికి ఎందుకో అర్థం కావడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.