అశోక్ వర్సెస్ కోలగట్ల

విజయనగరం సీట్లో రెండు సార్లు పూసపాటి వారి మీదనే గెలిచి రికార్డు సృష్టించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి 2024లో మళ్లీ తానే విజయనగరం ఎమ్మెల్యే అంటున్నారు. తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని…

విజయనగరం సీట్లో రెండు సార్లు పూసపాటి వారి మీదనే గెలిచి రికార్డు సృష్టించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి 2024లో మళ్లీ తానే విజయనగరం ఎమ్మెల్యే అంటున్నారు. తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని చెబుతున్నారు. తానేంటో ప్రజలకు తెలుసు అని కోలగట్ల కడు నమ్మకంగా చెబుతున్నారు.

అశోక్ గజపతి రాజు చాలా సార్లు ఎమ్మెల్యే, మంత్రి అయినా విజయనగరానికి చేసిందేమీ లేదని కోలగట్ల అంటున్నారు. అశోక్ తానే గెలుస్తాను అన్న భ్రమల్లో ఉన్నారని, వాస్తవాలని ఆయన గురించాలని కోలగట్ల సెటైర్లు వేశారు సమాజానికి తానే ఏకైక మార్గదర్శకుడిని ని అశోక్ అనుకుంటున్నారేమో అని ఎద్దేవా చేశారు. ఆయన ఒక్కరే కాదని, చాలా మంది ఉన్నారని, అలాగే నిజాయతీపరులు ఎంతో మంది ఉన్నారని, తన నిజాయతీని ఎవరైనా శంకించగలరా అని కోలగట్ల ప్రశ్నించారు.

అశోక్ మీద 2004లో కోలగట్ల గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో మళ్లీ గెలిచారు. ఈసారి అశోక్ కుమార్తె అదితి గజపతిరాజు మీద ఆయన విజయం సాధించారు. ఇలా తండ్రీ కూతుళ్ల మీద గెలవడం కోలగట్ల పొలిటికల్ రికార్డు గా ఉంది. తన ఇన్నింగ్స్ అయిపోలేదని ఆయన చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి వీలుంటే మంత్రి కావాలని కోలగట్ల ఆశతో ఉన్నారు.

అశోక్ గజపతిరాజు దశాబ్దాలుగా రాజ్యం చేశారని, జనాలు చూశారని ఆయన మళ్లీపోటీ చేసినా గెలుపు తనదేనని కోలగట్ల ధీమాగా ఉన్నారు. అశోక్ గతం కంటే ఈసారి ఎక్కువగా జనాల్లోకి వస్తున్నారు. రాజా వారు చిన్న అంశాలను కూడా వదలడంలేదు. దాంతో అన్నీ రాజకీయమేమా రాజు గారూ అంటూ కోలగట్ల ఫైర్ అవుతున్నారు. 2024లో ఈ ఇద్దరి మధ్యనే పోరు సాగనుంది. విజయం ఎవరిని వరిస్తుందో తెలియదు, ఏడాది ముందే ఈ ఇద్దరి రాజకీయంతో విజయనగరం గరం గరంగా మారింది.