కాపుగా పుట్టడం అదృష్టం…మాజీ మంత్రి సంచలన కామెంట్స్

ఎవరికైనా వారు పుట్టిన కులం అంటే అభిమానం ఉండాలి. అది తప్పు కాదు, అలాగే విశాఖ జిల్లా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు తన కులాభిమానాన్ని నిండుగా చాటుకున్నారు. కాపుగా పుట్టడం తన అదృష్టం అని…

ఎవరికైనా వారు పుట్టిన కులం అంటే అభిమానం ఉండాలి. అది తప్పు కాదు, అలాగే విశాఖ జిల్లా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు తన కులాభిమానాన్ని నిండుగా చాటుకున్నారు. కాపుగా పుట్టడం తన అదృష్టం అని మంత్రి సంచలన కామెంట్స్ చేశారు. తాను కాపులకు అండగా ఉంటాను అని ఈ సందర్భంగా ఆయన గొప్ప హామీ ఇచ్చారు.

కాపులకు విశాఖలో ముప్పయి కోట్ల రూపాయలు విలువ చేస్తే 2,400 గజలా స్థలాన్ని ముఖ్యమంత్రి జగన్ ఉచితంగా కేటాయించి తన ప్రేమను ఈ కులం మీద చూపించారు అని మంత్రి కొనియాడారు.  

కాపులకు వైసీపీ పాలనలో అన్ని విధాలుగా పెద్ద పీట వేస్తున్నారు అని కూడా పేర్కొన్నారు. కాపుల సంక్షేమం కోసం నిర్మించ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ అంతా తానే ఖర్చుని భరించి అద్భుతంగా తయారు చేస్తాను అని ఆయన పేర్కొన్నారు.

కాపులకు మేలు చేసిన వారిలో ప్రముఖ కాపు నాయకులు మిరియాల వెంకటరావు, ముద్రగడ పద్మనాభం అగ్ర స్థానంలో ఉంటారని అవంతి పేర్కొనడం విశేషం. వారి సేవలను కాపులు ఎపుడూ గుర్తు తెచ్చుకుంటారని ఆయన అన్నారు. 

ఏపీలో కులాలకు మతాల‌కు అతీతంగా జగన్ పాలన సాగుతోంది అని ఆయన చెప్పడం విశేషం. మొత్తానికి కాపుగా పుట్టినందుకు తన రుణం తీర్చుకుంటాను అని మంత్రి గారు ఒట్టేసి మరీ చెబుతున్నారు.