ఇదేం పిచ్చి బుద్ధా.. బాబుకు ర‌క్తంతో అభిషేకం!

ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ సీట్ల కోసం ఆశించే నాయకుల హడావుడి మామూలుగా ఉండ‌టం లేదు. నిన్నటికి నిన్న నూజివీడు టీడీపీ ఇంఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తనకు సీటు రాలేద‌ని కన్నీళ్లు పెట్టుకుని…

ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ సీట్ల కోసం ఆశించే నాయకుల హడావుడి మామూలుగా ఉండ‌టం లేదు. నిన్నటికి నిన్న నూజివీడు టీడీపీ ఇంఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తనకు సీటు రాలేద‌ని కన్నీళ్లు పెట్టుకుని త‌న‌కు సీటు ఇవ్వాల‌ని వేడుకుంటే.. ఇవాళ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విన్నుత రీతిలో త‌న‌కు సీటు ఇవ్వాల‌ని చంద్రబాబు నాయుడుని వేడుకున్నారు

ఇవాళ బుద్ధా వెంకన్న స్వయంగా తన రక్తాన్ని బాటిల్ లో ఎక్కించుకొని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి రక్తంతో అభిషేకం చేసి..  రక్తంతో గోడపై ‘‘సీబీఎన్ జిందాబాద్.. నా ప్రాణం మీరే’’ అంటూ రాశారు. త‌న గురించి వాస్తవాలు చంద్ర‌బాబుకి తెలియాలనే ఈ కార్యక్రమం చేపట్టానని అన్నారు. విజ‌య‌వాడ వెస్ట్ నియోజకవర్గం తప్ప అన్ని స్థానాల్లో ఐవీఆర్ నిర్వహస్తున్నారని..  ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని గతంలో చంద్రబాబుకి, లోకేశ్‌కి చెప్పిన ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాపోయారు.

వెంక‌న్న‌ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీలో ఎవరు మాట్లాడకపోయినా తానే మాట్లాడానని.. అధికార పార్టీ నేతలతో గొడవలకు వెళ్లి చావు వరకు పోయి వచ్చానని అలాంటి తనకు అనకాపల్లి ఎంపీ లేదా విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని వేడుకున్నారు. నేను నాయకుడిని కాదా? నాకు డబ్బులు లేవా? నాకు గెలిచే శక్తి  లేదా? అసలు నా గురించి చంద్రబాబు ఏమనుకుంటున్నాడో చెప్పాలని డిమాండ్ చేశాడు. ఎవరితో అయినా పోటీకి వెళ్లడానికి రెడీ అని తనలాంటి నిజాయితీపరులకు సీటు సీటు ఇస్తే జీవితాంతం చంద్ర‌బాబు.. లోకేష్‌..  దేవాన్ష్ కోసం ప‌ని చేస్తాన‌న్నారు

కాగా పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు జనసేనకు కేటాయించే అవకాశం ఉండడంతో బుద్ధా వెంకన్న ఇవాళ ఇంత రచ్చ చేశార‌ని టీడీపీలోని వెంకన్న వ్యతిరేకవర్గం అంటోంది. బహుశా వెస్ట్ రాకపోతే బుద్ధా వెంకన్న ప్రత్యర్థుల దగ్గర తన ముఖం ఎలా పెట్టుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది. ఇప్ప‌టికే బుద్ధా.. చంద్ర‌బాబు  కోసం సూసెడ్ చేసుకోవడానికైనా రెడీ అని చెప్పిన సంగ‌తి తెలిసిందే.