కొడాలి మ‌మ్మ‌ల్ని చంపు… లేక‌పోతే మేము చంపుతాం!

చంద్ర‌బాబు గ‌త రెండు రోజులుగా కృష్ణా జిల్లా టీడీపీ నేత‌ల‌కు క్లాస్ పీకిన త‌ర్వాత ఈ రోజు వారిలో క‌ద‌లిక వ‌చ్చిన‌ట్టు ఉంది. అందుకే ఇవాళ పార్టీ అధినేత చంద్ర‌బాబు, లోకేష్ ల‌పై కొడాలి…

చంద్ర‌బాబు గ‌త రెండు రోజులుగా కృష్ణా జిల్లా టీడీపీ నేత‌ల‌కు క్లాస్ పీకిన త‌ర్వాత ఈ రోజు వారిలో క‌ద‌లిక వ‌చ్చిన‌ట్టు ఉంది. అందుకే ఇవాళ పార్టీ అధినేత చంద్ర‌బాబు, లోకేష్ ల‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్య‌ల‌పై పొలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు త‌ర్వాత మీడియాతో మాట్లాడిన బుద్ధ వెంక‌న్న కొడాలి నాని పై అనుచిత‌ వ్యాఖ్య‌లు చేశారు.

ఇలా మాట్లాడితేనే మీడియా, చంద్ర‌బాబు నాయుడులు త‌న‌కు గుర్తిస్తారు అనుకున్న‌ట్లు ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న. కొడాలి నాని.. మ‌మ్మ‌ల్ని చంపు.. లేక‌పోతే.. 2024 త‌ర్వాత నిన్ను మేమే చంపేస్తాం అని సంచాలన‌ వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో కూడా 100 మందితో సూసైడ్ బ్యాచ్ రెడీ.. చంపడానికైనా, చావడానికైనా సిద్దం అంటూ బుద్ధా వెంక‌న్న సంచాల‌న వ్యాఖ్య‌లు చేశారు.

బుద్ధా వెంక‌న్న దైర్యం ప‌ల్నాడులో రాష్ట్రం మొత్తం చూసింది. ప‌ల్నాడుకు వెళ్లి అక్క‌డ వైసీపీ కార్య‌క‌ర్త‌లను చూస్తేనే మూర్ఛ వ‌చ్చినట్లు న‌టించి ప‌డిపోయి.. విజ‌య‌వాడ‌కు పారిపోయిన బుద్ధా వెంక‌న్న ఇలాంటి వార్నింగ్ ల‌ను టీడీపీ కార్య‌క‌ర్త‌లే ప‌ట్టించుకొరంటే వైసీపీ నాయ‌కులు ప‌ట్టించుకుంటారా. 

2019 ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ముందు బుద్ధా వెంక‌న్న‌ తొడ గొట్టి చేసిన కామోడీని ప్ర‌జ‌లు మ‌ర్చిపోతార‌నే భ‌యంతోనే ఇలా కామోడీ స్టేట్మెంట్స్ ఇస్తున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది.