మోడీతో ఉక్కు ఇష్యూ చర్చించలేదా?

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో గత రెండు రోజులుగా గడుపుతున్నారు. ఆయన సోమవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు, మంగళవారం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఎవరితో ఏమి మాట్లాడారో ఆయన మీడియాకు…

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో గత రెండు రోజులుగా గడుపుతున్నారు. ఆయన సోమవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు, మంగళవారం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఎవరితో ఏమి మాట్లాడారో ఆయన మీడియాకు విడమరచి చెప్పారు.

అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంక్ నిధులు తొందరగా వచ్చేలా చూడమని ప్రధానిని కోరామని అన్నారు. అలాగే జాతీయ రహదారుల పెండింగు పనులు, పోలవరం నిధులు, హైవేలు ఇలా అన్నీ చర్చించామని చెప్పిన చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాత్రం కేంద్ర ఉక్కు మంత్రి కుమార స్వామితో చర్చించామని చెప్పడం గమనార్హం.

ప్రధాని చేతిలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కత్తి ఉంది అని కార్మిక సంఘాలు అంటున్నాయి. మోడీ తలచుకుంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తక్షణం ఆగిపోతుందని కూడా వారు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అలాంటి ప్రధానితో స్టీల్ ప్లాంట్ అంశం బాబు ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌ని అడుగుతున్నారు.

ఎన్డీయే కూటమిలో ఉన్న జేడీయూ అధినేత కేంద్ర మంత్రి కుమారస్వామితో చర్చించామని అంటున్నారు, ఆయన మళ్ళీ ఈ ఇష్యూని ప్రధాని వద్దకే తీసుకుని వెళ్లాలి కదా అని కార్మిక నేతలు అంటున్నారు. ఎన్డీయే కూటమికి మద్దతు ఇస్తున్న ప్రధాన పక్షంగా ఉన్న టీడీపీ అధి నాయకుడు మోడీతోనే నేరుగా ఈ అంశం మాట్లాడితే పరిష్కారం చాలా సులువుగా అయ్యేదని అంటున్నారు. చంద్రబాబు మాత్రం కుమారస్వామితో మాట్లాడామని శాశ్వత పరిష్కారం చూపించమని కోరామని చెబుతున్నారు

దీని మీదనే స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు పెదవి విరుస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యమం తారస్థాయికి చేరింది. మంగళవారం కేంద్రం నుంచి శుభ వార్త వస్తుందని అంతా ఆశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఢిల్లీలో ఉండడంతో ఉక్కు కర్మాగారానికి ఒక శుభమైన పరిష్కారం దక్కుతుందని ఆశించారు. కానీ ఎప్పటి మాదిరిగానే ఉక్కు మంత్రికి విన్నపాలు చేసారని అంటున్నారు. ఇలాగైతే కేంద్రం ప్రైవేటీకరణ విషయంలో దూకుడుగానే పోతుందని అంటున్నారు. కేంద్రం మనసులో ప్రైవేటీకరణ అన్నది ఉందని తెలిసే ఈ విధంగా చేస్తున్నారా అని కూడా కార్మిక సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

11 Replies to “మోడీతో ఉక్కు ఇష్యూ చర్చించలేదా?”

  1. తొందర ఎందుకండీ… చాల చర్చించారు…. చూస్తారుగా, చర్చల పర్యవసానాలు మీరే చూస్తారు… Just wait and see…. CBN batting

  2. ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు.. ఆంధ్ర విసిపోయినప్పుడే విభజన ఆపలేకపోయారు.. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆపుతారు అంటే నమ్మొచ్చా

  3. స్టీల్ ప్లాంట్ ప్రయివేట్ పరం కాకపొతే అది చెంబా + సనాతన సామి అకౌంట్ లో వేసి చంకలు గుద్దుకుంటారు. ఒకవేళ ప్రయివేట్ పరం అయితే జగన్ అకౌంట్ లో వేసేసి దులుపుకుంటారు.🤣😂 సూపర్ సిక్స్ పరిస్థితి అదే కదా 😛

  4. Haryana lo BJP got bumper majority. ika visaka ukku ledu tukku ledu. BJP should just proceed and privatize immediately. The longer they drag this, the more importance they are giving to these jokers called unions. Why should tax payers keep paying to safeguard a loss making unit. Private fellows should run businesses, it is of no concern to the Government.

  5. రాజా గారు, ఏ పార్టీని సపోర్ట్ చేయడం మీ ఇష్టం కానీ, చదువుకున్నవాళ్లం కదా, మన మనిషితనం తగ్గించుకొని, ఒక పార్టీకోసం పూర్తిగా వంగిపోవడం తగదు. జీవితం అనేది ఈ రాజకీయాలకంటే చాలా గొప్పది. మీరంతా పార్టీలో మునిగిపోయి, ఎంత మోజు పడ్డారో కాస్త ఆలోచించండి, ఇది మంచిదే కాదు!

    మీరు మతం మార్చుకున్నారేమో, అదేమో మీ వ్యక్తిగత నిర్ణయం, మన తెలుగోళ్ళం అందరినీ గౌరవించాలి కదా! మతం మార్చుకోవడం గొడవేం కాదు, మీ ఇష్టం. కాని, జగనన్నను సపోర్ట్ చేస్తూ, మీ పూర్వికుల మతం అయిన హిందూ ధర్మాన్ని తప్పు చూపడం తగదు. మన పూర్వికులు హిందువులు, వాళ్లు మనకు గౌరవం నేర్పారు, మీరు ఏ మతాన్ని ఫాలో అయినా కానీ, వాళ్ల మతం మీద ద్వేషం పెట్టుకోవడం మీకే నష్టం.

    మన ఆంధ్ర సంస్కృతి ఎప్పుడు అందర్నీ కలుపుకొని పోతూ, గౌరవం, సహనం నేర్పింది. మన రాష్ట్రాల్లో ఎంత మంది క్రైస్తవులే NDA కూటమికే ఓటు వేశారు. రాజకీయాల కోసం మతం మీద కోపం పెట్టుకోవడం, తక్కువ చేయడం అవసరం లేదు. మీరు జగనన్నను సపోర్ట్ చేయండి, మీ మతంలో సంతోషంగా ఉండండి, కానీ హిందూ మతాన్ని గౌరవించండి.

    రాజా గారు, ఈ ద్వేషం నుంచి బయటపడండి. మనిషి జీవితమే చిన్నది, అది కూడా ఈ హేట్రెడ్ మీద పెట్టుకోవడం తగదు. మన తెలుగు సంస్కృతి మనకు అందర్నీ గౌరవించాలనే నేర్పించింది. ఇది వదిలేసి, శాంతి, సత్సంబంధాలతో ఉన్న జీవితం గడపండి. అప్పుడే మీరు నిజమైన సంతోషాన్ని పొందుతారు. అదే మనందరికీ కావాల్సింది

  6. మన ఎడుపు వారికి శ్రీరామ రక్ష..ఎందుకు GA ఇంకా వంకర బుద్ది తోనే ఉన్నావ్ ? 5 ఏళ్లు మనం చేసిన అరాచకానికి జనం బెదిరి వోట్లు అటు వేసారు.

    మనం ఉన్నా అన్నీ మంచి అవకాశాలని వదిలేసి చేడు ఎక్కడ ఉంటె అక్కడ వేలు పెట్టి వాసన చూసి అది చాలక నాకి చి ఛీ

  7. ఇవ్వన్నీ జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రశ్నించావా

    Press meet కూడా పెట్టకుండా పారిపోయి వచ్చేవాడు jagan

Comments are closed.