ముంబయ్ నటి కాదంబరి జెత్వానీ కేసులో సీఐడీ అధికారులు సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుతో గేమ్ ఆడుతోందన్న చర్చకు తెరలేచింది. ఈ కేసులో నిఘా మాజీ అధికారి అయిన పీఎస్ఆర్ నుంచి ఏవో వివరాలు రాబట్టాలని సీఐడీ అధికారులు కస్టడీ కోరారు. సీఐడీ అధికారుల కోరిక మన్నించి మూడు రోజుల కస్టడీకి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.
ఇందులో భాగంగా విచారణకు పీఎస్ఆర్ ఆంజనేయులు ఆదివారం సిద్ధమయ్యారు. అయితే విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి, బీపీలో హెచ్చుతగ్గులున్నాయని, ఆయనకు విశ్రాంతి ఇవ్వాలంటూ వైద్యులు సూచించారు. తన ఆరోగ్యానికి సంబంధించి ఇవన్నీ మామూలు విషయాలే అని, విచారించాలని పీఎస్ఆర్ కోరినా సీఐడీ అధికారులు మాత్రం వినలేదు. తిరిగి ఆయన్ను జైలుకు తీసుకెళ్లారు.
నిజంగా పీఎస్ఆర్ ఆంజనేయులు ఆరోగ్యంపై సీఐడీకి అంత శ్రద్ధాసక్తులు వుంటే, ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించాల్సి వుంది. కానీ అలా జరగలేదు. కస్టడీ కోరి మరీ తీసుకున్న తర్వాత నిఘా మాజీ చీఫ్తో సీఐడీ ఎందుకలా వ్యవహరిస్తున్నదో విచారణ అధికారులకే తెలియాలి.
ఇవాళ మాత్రం ఆంజనేయుల్ని సీఐడీ అధికారులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. సీఐడీ ఏం కోరుకుంటున్నది? ఆయన ఏం చెబుతారో చూడాలి. మొత్తానికి పీఎస్ఆర్ ఆంజనేయులు విషయంలో ముప్పుతిప్పలు పెట్టడం ద్వారా ఆనందం పొందాలని ఎవరో కోరుకుంటున్నట్టుగా వుంది. ఆ మేరకే ఇదంతా జరుగుతోందన్న అనుమానం వ్యక్తమవుతోంది.
ఎవరొ అనందం పొందెదెమిటిరా?? ఈయన చెసిన నెరాన్ని సమర్దిస్తావా???
.
వీళ్ళు చెసె అరాచకాలకి ఈ రాష్ట్ర ప్రజలె కాదు, ఇతర రాష్ట్రం వాళ్ళకి తప్పలెదు వెదింపులు! ఇప్పటికె విశాల్ గున్ని ఈయన చెపితెనె చెసాను అని చెప్పాడు అంటగా!
మా అన్నయ్య పాలనలో అయితే ఇలాంటివి రాయరు.. జగనన్న తో పెట్టుకుంటే ఇలాగే అవుతుంది అని గొప్పగా రాస్తారు.
మీరు బురద పందులు అని అందరూ అలానే వుంటార?
ఇడియగా మా నీళ్ పాటించిన పద్దతి…ఎవరో ఆనందం కోసం రఘురామ రాజు ని కొట్టి లైవ్ వీడియో పెట్టింది
So you are supporting the crime he committed, that is also a crime
కరెక్ట్ రా ఎంకి, వాడ్ని అరెస్ట్ చేసింది హాస్పిటల్ నుండి అయితే అలాగే చేసి ఉందురు, అయినా BP కి హాస్పిటల్లో ఎవరు చేరతారు!! అంతెందుకు ఇప్పుడు మాడా రెడ్డి గాడి టెన్షన్ కి బీపీ, షుగర్, mental stability చాలా ఘోరంగా ఉండివుంటది, వాడ్ని కూడా హాస్పిటల్లో join చేద్దామా??
డాక్టర్స్ ఆబ్సెర్వేషన్ లో ఉంచాలా వద్దా అన్నది డాక్టర్స్ డిసైడ్ చేస్తారు..
బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు విచారించాలా వద్దని సీఐడీ ఆఫీసర్స్ డిసైడ్ చేసుకొంటారు..
అతనికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే.. ఇక్కడ మీరే నిందిస్తూ రాస్తారు..
హై బీపీ తో సతమయ్యేటప్పుడు విచారణ ఎందుకు జరిపారు అని మీరే ప్రశ్నిస్తారు..
ఇది జగన్ రెడ్డి జమానా కాదు.. కాబట్టి.. మూసుకుని జరిగేది చూస్తూ ఉండండి.. మీ సలహాలు మాకు అక్కరలేదు..